విపత్తులొచ్చినా కేసీఆర్ వర్కింగ్ స్టైల్ అంతే !

తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన వరదలతో పెద్ద ఎత్తన నష్టం జరిగింది. వారం నుంచి ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం.. తన వర్కింగ్ స్టైల్ ను మార్చుకోలేదు. ఆయన సమీక్షలు చేస్తున్నారని అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారని మీడియాకు ప్రకటనలు ఇవ్వడమే కానీ నిజమేంటో ఎవరికీ తెలియదు.

ఓ వైపు వరదల హెచ్చరికలు ఉన్నా… తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం కాలేదని.. ప్రజల్ని తరలించే ప్రయత్నం చేయకపోవడం వల్లనే పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించిందనే విమర్శలు వస్తున్నాయి. చివరికి కేంద్ర సహాయ బృందాలు, ఎన్డీఆర్ఎప్, ఆర్మీ హెలికాఫ్టర్లు వస్తే తప్ప.. కొంత మందిని కాపాడలేకపోయారు. అధికార యంత్రాగం అంతా నిస్సహాయమైపోయిందన్న విమర్శలు విపక్షాల నుంచే కాదు బాధితుల నుంచి వచ్చాయి.

వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్‌లో పర్యటించిన కేటీఆర్ కడెం ప్రాజెక్టు గురించి తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తన శాఖ గురించి అడగాలని సలహా ఇచ్చారు .కానీ కేటీఆర్ అన్ని శాఖల పనులు ప్రకటనలు చేస్తున్న విషయాన్ని మర్చిపోయారు. వరంగల్ అతలాకుతలం అయినా కేసీఆర్, కేటీఆర్ అక్కడకు వెళ్లి బాధితులకు భరోసా ఇద్దామనే ఆలోచన చేయలేదు. దీంతో సహజంగానే విపక్ష నేతలు కేసీఆర్ మిస్సింగ్ అంటూ ఆరోపణలు చేయడం ప్రారంభించారు.

అయితే ఇలాంటి రాజకీయాల్ని ఎలా ఎదుర్కోవాలో కేసీఆర్‌కు తెలుసు. అందుకే కేబినెట్ భేటీ పెడుతున్నామని.. ఆర్థిక సాయం అందిస్తామన్న లీక్ ఇచ్చారు. మూడో తేదీ నుంచి అసెంబ్లీ సమవేశాలు పెడుతున్నారు. ఈ సమయంలో బాధితుల్ని ఆదుకోకుండా రాజకీయాలేమిటి అన్న విమర్శలు రాకుండా వారి కోసమే అన్నట్లుగా వీటిని పెడుతున్నారు. మొత్తంగా కేసీఆర్ వర్కింగ్ స్టైల్ అంతేనని.. ప్రజలే తెలుసుకోవాలని ఇతర పార్టీల నేతలు నిట్టూరుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close