ఖైదీ నెం.150 సంగ‌తులు చెప్పిన చ‌ర‌ణ్‌

ఈరోజుంతా చిరంజీవి హంగామానే. ఓ ప‌క్క చిరు పుట్టిన రోజు వేడుక‌లు, మ‌రోవైపు ఖైదీ నెం.150 హంగామా… వెర‌సి మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. చిరంజీవి కోసం మెగా ఫ్యాన్స్ భారీ ఎత్తున పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. వాటిలో రామ్ చ‌ర‌ణ్ కూడా పాల్గొన్నాడు. త‌న తండ్రి కోసం పూజ‌లు చేస్తున్న అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు.

అంతేకాదు.. ఖైదీ నెం.150 సంగ‌తుల్నీ బ‌య‌ట‌పెట్టాడు చ‌ర‌ణ్‌. క‌థ‌ని అనుగుణంగానే టైటిల్ నిర్ణ‌యించామ‌ని, టీజ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని అన్నాడు. సినిమా అప్ డేట్స్ చెబుతూ… ఇప్ప‌టికే స‌గం సినిమా పూర్త‌య్యింద‌ని, ఫ‌స్టాఫ్‌కి సంబంధించిన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించార‌ని చెప్పుకొచ్చాడు. దీపావ‌ళికి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేద్దామ‌నుకొన్నామ‌ని, అయితే అభిమానుల కోసం ప్రీలుక్ బ‌య‌ట పెట్టాల్సివ‌చ్చింద‌న్నాడు. నిర్మాణంలో పాలుపంచుకోవ‌డం గౌర‌వంగా ఉంద‌ని, అంత‌కు మించి బాధ్య‌త‌గా ఫీలౌతున్నాన‌ని అంటున్నాడు. ఈ సినిమా ఇంత వేగంగా పూర్త‌వ్వ‌డానికి కార‌ణం వినాయ‌క్ మాత్ర‌మే అంటున్నాడు చ‌ర‌ణ్‌. ఈ సినిమాలో మీరూ క‌నిపిస్తారా? అని అడిగితే ”అప్పుడే చెప్ప‌లేం. ఇంకా పాట‌లు తీయాల్సివుంది క‌దా? అప్పుడేమైనా కుదిరితే చూద్దామ‌” అంటున్నాడు. అంటే… ఈ సినిమాలో చ‌ర‌ణ్ కూడా క‌నిపించే ఛాన్సులు పుష్క‌లంగా ఉన్నాయ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close