లాక్ డౌన్ : మందుబాబుల హాహాకారాలు

దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. పిట్ట బయట కనపడినా ఊరుకునేది లేదని కేంద్రంతో పాటు రాష్ట్ర పభుత్వాలు కూడా కొరడా ఝళిపస్తున్నాయి. రైతు బజార్లలో కూరగాయల కొనుగోళ్లు, నిత్యావసరాలైన పాలు, వివిధ సరుకుల కొనుగోలు కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణిత సమయాలలో ప్రజలకు అనుమతి ఇస్తున్నాయి. తొలి రోజుతో పోలిస్తే రోడ్ల మీదకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. అయినా అడపా దడపా జనాలు వస్తూనే ఉన్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అసలు గొడవంతా మందుబాబులతోనే వస్తోంది. గత ఆదివారం నాడు కేంద్రం జనతా కర్య్ఫూ ప్రకటించింది. ఆ ఒక్క రోజు ఇళ్లలో ఉంటే ఇక కరోనా రాదులే… అని దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ప్రజలు జనతా కర్య్ఫూ కు సహకరించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రాకుండా భారతదేశం మొత్తం ఈ జనతా కర్య్ఫూకు తన సహాయాన్ని అందించింది. దీనికి మందు బాబులు కూడా తమ వంతు సాయం అందించారు. జనతా కర్య్ఫూ కు ముందు రోజైన శనివారం నాడే చాలా మంది ఆదివారం కోసం మందూమాకు సిద్ధం చేసుకున్నారు. తీరా ఆదివారం సాయంత్రం కాగానే కేంద్రం, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లాక్ డౌన్ బాంబు పేల్చయి. తొలి రోజు దీన్ని లైట్ గా తీసుకుని మందు బాబులు షాపుల తెరుచుకుంటాయిలే అని భావించారు. అయితే, లాక్ డౌన్ ను ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక్క మద్యం దుకాణం కూడా తెరుచుకోకుండా చర్యలు తీసుకోవడంతో మందు బాబుల కష్టాలు ప్రారంభమయ్యాయి. రోజురోజూ గడుస్తున్న కొద్దీ మందు బాబులకు మందు కరవైంది. తెలంగాణలో అయితే మద్యం అమ్మకాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. తెలంగాణలో శుభమైనా, అశుభమైనా, మంచైనా, చెడైనా మందు ఉండాల్సింది. దీంతో తెలంగాణలో మందు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. శుక్రవారం నాడు “మందు లేకపోతే ఎలా…కనీసం రోజుకు రెండు గంటలైనా మందు దుకాణాలు తెరవండి. మా మగవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు” అంటూ కొందరు మహిళలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. “మాయదారి రోగం కరోనా వస్తదో.. రాదో.. ఎవ్వరికీ ఎరిక లేదు.తాగుడు బంద్ అయితే మాత్రం సానా కష్టంగా ఉంది” అంటూ ఆ వీడియోలో మహిళలు వాపోయారు. శుక్రవారం రాత్రి అయితే మందు దొరకక ఓ మందు బాబు ఏకంగా బేగంపేట ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరో రోజుల పాటు తెలంగాణలో మద్యం అందుబాటులోకి రాకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో అని ప్రతి చోటా ఆందోళన వ్యక్తం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close