క్రైమ్ : కుమార్తెలను బలిచ్చిన టీచర్లు…!

మదనపల్లి శివారులోని టీచర్స్ కాలనీ అత్యంత విలాసంగా కనిపిస్తున్న భవనంలో జంట హత్యలు జరిగాయి. ఎదిగి వచ్చిన ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులు చంపేశారు. పూజ గదిలో ఒకరిని శూలంతో పొడిచి చంపేశారు. మరొకరిని రాగి చెంబు నోట్లో పెట్టి డంబెల్‌తో కొట్టి చంపేశారు. చనిపోయిన ఇద్దరూ చిన్న వాళ్లేం కాదు 22 ఏళ్లు..27 ఏళ్లు. వారిని చంపిన తల్లిదండ్రులూ నిరక్ష్య రాస్యులు కాదు. బాగా చదువుకున్న వారే. ఆ చదువును.. విజ్ఞానాన్ని ఎంతో మందికి పంచుతున్న ఉపాధ్యాయులే. అయినా కూతుళ్లను చంపేశారు. దీనికి కారణం కుటంబససమస్యలో.. మరొకటో అయితే పాపం అనుకునేవారు కానీ… మూఢ నమ్మకాలతో… తమ బిడ్డలు మళ్లీ బతుకుతారన్న నమ్మకంతో చంపేశారు.. ! ఈ కారణం తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రుల వైపు ఎలా చూడాలో.. పోలీసులకు జనాలకు అర్థం కావడం లేదు.

పురుషోత్తంనాయుడు, పద్మజ అనే దంపతులు ఉపాధ్యాయులు. పురుషోత్తం మహిళా డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌. పద్మజ ప్రైవేటు కాలేజీ కరస్పాండెంట్. వీరు కొత్తగా ఓ ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఆ ఇంట్లో దివ్య శక్తులు ఉన్నాయని పూజలు చేయడం ప్రారంభించారు. బయటకు వీరు సాధారణంగానే ఉంటూ ఉంటారు. దీంతో పూజల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు. తర్వాత ఏం చేయాలో తెలియక.. .పురుషోత్తం నాయుడు తన స్నేహితులకు సమాచారం అందించారు. షాక్‌కు గురైన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు పురుషోత్తం నాయుడు, పద్మజలను అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ కుమార్తెలు చనిపోలేదని.. తమ ఇంట్లో అదృశ్య శక్తులు ఉన్నాయని.. వారు రేపు లేచి వస్తారని చెబుతున్నారు. వీరి మాటలు విని పోలీసులు కూడా ఆశ్చర్య పోతున్నారు. వారిని ఎలా ట్రీట్ చేయాలో తెలియక సతమతమవుతున్నారు. తాము కూడా బతికి వస్తామని ఆత్మహత్యచేసుకుంటారేమోనని పోలీసులు వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

బాగా చదువుకుని విద్యాబుద్దులు నేర్పుతున్న ఆ ఇద్దరు ఇలా పూజలు.. మూఢనమ్మకాల మత్తులోకి వెళ్లడానికి ఓ దొంగ స్వామిజీ కారణంగా అనుమానిస్తున్నారు. మదనపల్లెకు చెందిన ఓ స్వామిజీ పట్టుకున్న పోలీసులు మిగతా వివరాలు రాబడుతున్నారు. ఆ ఇల్లు కట్టినప్పడి నుంచి పూజల రూపంలో ఆ ఉపాధ్యయ దంపతుల్ని మూఢ నమ్మకాలకు గురి చేసి.. వారిలో ఓ రకమైన హింసాత్మక భావనను పెంచారని… చివరికి కన్నబిడ్డలను చంపుకునేలా చేయడంలో ఆ స్వామిజీ పాత్ర ఉందని నమ్ముతున్నారు. నలుగురికి చెప్పాల్సిన వారే అంత దారుణమైన మూఢనమ్మకాలను నమ్మి.. కన్న బిడ్డలను చంపుకునే పరిస్థితి రావడం చాలా మందిని కలచి వేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close