తెదేపా మనసులో మాటనే నారాయణ చెప్పారేమో?

ప్రత్యేక హోదా పేరుతో ఏపిలో పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్దార్థ నాథ్ అన్నారు. ఆయన మాటలు అక్షరాల నిజమని మన రాజకీయ పార్టీలు నిరూపిస్తున్నాయి. ఆ వ్యాఖ్యని ప్రస్తావించి, అది తెదేపాని ఉద్దేశ్యించి చేసినదేనని వైకాపా కూడా తేల్చి చెప్పింది. అది రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్య అని తెదేపా అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే తెదేపాతో సహా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలను (భాజపా తప్ప) ఉద్దేశ్యించి అన్నమాటేనని వారికీ తెలుసు.

జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోడీని నిలదీసి అడగరు. ఆయన లెక్కలు, సమస్యలు, కారణాలు ఆయనకున్నాయి. అవేమిటో అందరికీ తెలుసు. కనుక ఆయన కేవలం చంద్రబాబు నాయుడునే హోదా గురించి నిలదీస్తుంటారు..నిందిస్తుంటారు.

కాంగ్రెస్ పార్టీకి భాజపాతో పొత్తులు పెట్టుకొనే అవకాశం లేదు కనుక రఘువీరా రెడ్డి మోడీని, చంద్రబాబు నాయుడుని కలిపి జాడిస్తుంటారు. కానీ రఘువీరా జగన్మోహన్ రెడ్డి జోలికి పోరు. అలాగే జగన్ కూడా కాంగ్రెస్ జోలికి పోరు. అది మరోరకమయిన ఈక్వేషన్. బహుశః వచ్చే ఎన్నికల నాటికి అది ‘సాల్వ్’ అవుతుందేమో చూడాలి.

ఇంక తెదేపా నేతలు ప్రతిపక్షాలు ఎంతగా నిలదీస్తున్నా, విమర్శిస్తున్నా వారికి జవాబులు చెపుతూ దులుపేసుకొంటారు తప్ప వారు కూడా ఎన్నడూ మోడీని నిలదీసి అడగరు. ఆ లెక్కలు అందరికీ తెలిసినవే. కానీ మద్యలో అప్పుడప్పుడు వాళ్ళ లెక్కలు కూడా తప్పుతుంటాయి. అప్పుడు వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని (మోడీని కాదుట) విమర్శిస్తారు. మళ్ళీ కూడికలు తీసివేతలు సరిచూసుకొని ‘తూచ్’ అంటూ ‘కేంద్రంతో మా బందం జన్మజన్మల అనుబందం’ అంటూ కోరస్ పాడేసి మళ్ళీ యధాప్రకారం ప్రతిపక్షాలతో యుద్ధాలు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు.

ప్రస్తుతం కోరస్ పాట పాడటం పూర్తయిపోయింది కనుక మళ్ళీ ప్రతిపక్షాలతో యుద్ధానికి సిద్దం అయిపోయారు తెలుగు తమ్ముళ్ళందరూ. వాళ్ళకి పెద్దన్న వంటి మంత్రి నారాయణగారు కూడా తనవంతుగా ప్రతిపక్షాల గురించి విలువయిన అభిప్రాయం వ్యక్తం చేసారు. “అన్నదమ్ములలాగా మెలుగుతున్న తెదేపా, భాజపాల మద్యన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా పేరిట చిచ్చు పెడుతున్నాయని” ఆరోపించారు. ఆయన ఆ మాట ఏదో యాదృచ్చికంగా అన్నట్లున్నా నిజానికి ఆయన తెదేపా మనసులో మాటనే చెపుతున్నారని భావించవచ్చు. ఒకవేళ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా గురించి గొడవ చేయకుండా ఊరుకొంటే, తెదేపా కూడా దాని గురించి ఎన్నడూ మాట్లాడవలసిన అవసరం ఉండేదే కాదు. అప్పుడు రాష్ట్రంలో తెదేపా, భాజపాల స్నేహం మూడు పచ్చ జెండాలు, ఆరు కాషాయ జెండాలు…సారీ..ఆరు పచ్చ జెండాలు…మూడు కాషాయ జెండాలుగా సాగిపోయేది కదా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close