మోడీ నిర్ణయం, ఉదారంగా వ్యవ”సాయం”

భారత దేశంలో రుణభారమే రైతుకు అతిపెద్ద శాపం. అప్పుల భారం పెరగడం వల్లే లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే, రైతన్నపై రుణభారం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి రుణాకు 7 శాతం వడ్డీ వర్తింపచేయాలని నిర్ణయించింది. సకాలంలో అప్పు తీర్చిన వారికి 4 శాతం వడ్డీకే రుణాలు అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది. 3 లక్షల రూపాయల వరకూ ఈ రాయితీని వర్తింప చేయడం వ్యవసాయానికి ఊతమిచ్చే నిర్ణయం.

పంట రుణాలు సరిగా అందక పోవడమే రైతులకు పెద్ద అవరోధంగా ఉంది. ప్రయివేటు వ్యాపారులు అడ్డగోలుగా వడ్డీ గుంజడం అన్నదాతకు గుదిబండ అవుతోంది. 7 శాతం వడ్డీకే రుణాలు లభిస్తే చెల్లించడం మరింత సులభం అవుతుంది. ఒకవేళ పంటలు పండకపోతే దానికి బీమా వర్తింపచేయాల్సి ఉంటుంది. ఈ విషయంలోనూ కేంద్రం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ఫసల్ బీమా యోజన పేరుతో సరళమైన విధానాన్ని ప్రకటించింది. అంతకు ముందున్న కఠినమన నిబంధనల్ని ఎత్తివేసింది. రైతు హిత విధానంగా దాన్ని రూపొందించింది.

అయితే కేంద్రం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు బడా కంపెనీలకు వేల కోట్ల రూపాయల రుణాలను ఉదారంగా ఇస్తుంటాయి. రైతులకు పంట రుణాలు ఇవ్వడానికి మాత్రం వెనుకాడతాయి. లక్ష రూపాయల పంట రుణం కావాలంటే సవాలక్ష కొర్రీలు పెడుతుంటాయి. ఇక, కౌలు రైతు పరిస్థితి మరీ దారుణం. ఈ విషయంలో కేంద్రమే చొరవ తీసుకోవాలి. పంట రుణాన్ని ఎలా ఇవ్వకుండా తప్పించుకుందామా అని కాకుండా వీలైనంత మంది రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలి.

నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన ఏ రైతుకూ పంట రుణాన్ని తిరస్కరించకూడదనే కఠిన నిబంధనను అమలు చేయాలి. ఒకవేళ తిరస్కరిస్తే దానికి బ్యాంకు చెప్పే కారణం సహేతుకుంగా ఉండాలి. అలా లేకపోతే సంబంధిత బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకునే రూల్స్ ఉండాలి. అవసరమైతే చట్టాలను సవరించాలి. అప్పుడే జై కిసాన్ అనే నినాదం ఆచరణలోనూ ప్రతిధ్వనిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close