భూకబ్జా కేసులో అరెస్టయిన నిర్మాతకు ఎంపీ టికెట్ ఇచ్చిన జగన్

నిన్న ఒక సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యధికంగా నేరస్తులకు టికెట్ ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ సీపీ అంటూ వ్యాఖ్యలు చేశారు. టికెట్లు ప్రకటించేటప్పుడు ఒకవైపేమో ఉద్దండరాయునిపాలెం లో అరటి తోటలు తగలబెట్టిన కేసులో నిందితుడైన సురేష్ నీ, మరొకవైపు కన్నెధార గ్రానైట్ కొండలు తవ్వేసిన నిందితుడు ధర్మాన ని జగన్ కూర్చోబెట్టుకున్నారు అని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రకటించిన లిస్టు ను పరిశీలించిన కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.

విశాఖపట్నం ఎంపీ టికెట్ ను జగన్ టాలీవుడ్ నిర్మాత ఎంవి.సత్యనారాయణ కేటాయించారు. ఈయన గీతాంజలి , లక్కున్నోడు తదితర చిత్రాలను నిర్మించారు. అయితే ఈయన విశాఖపట్నంలో లో క్రికెట్ స్టేడియం ఎదురుగా 2016లో గేటెడ్ కమ్యూనిటీ నిర్మించ తలపెట్టారు. అక్కడ ఉన్న 88 ప్లాట్లలో 38 ఫ్లాట్లను కొనుగోలు చేశారు. 357/1 , 357/2 సర్వే నంబర్లు గల ఆ ఫ్లాట్లలో ఆయన గేటెడ్ కమ్యూనిటీ లాంచ్ చేసినప్పుడు హోర్డింగ్ల లో మాత్రం తాను కొన్న 38 ప్లాట్ లతోపాటు వాటి పక్కన ఉన్న ప్లాట్ లు కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీల లోకి వస్తాయి అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా సమాచారాన్ని ఏర్పాటు చేశారు. దీంతో భయభ్రాంతులకు లోనైన పక్క ప్లాట్ల యజమానులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పట్లో పోలీసులు ఆయనను అరెస్టు కూడా చేశారు. అయితే, తెలుగుదేశం పార్టీ నేత కళావెంకట్రావు ఉద్దేశపూర్వకంగానే తనను అరెస్టు చేయించాడు అని సత్యనారాయణ అప్పట్లో ఆరోపణలు చేశారు.

ఏది ఏమైనా ఇప్పుడు జగన్ ఈయనకు ఏకంగా విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వడంతో విశాఖ వాసులు ఆశ్చర్యపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close