కోర్టు సీన్ల‌న్నీ నంద‌మూరి వారి ఎకౌంట్‌లోనే

నంద‌మూరి హీరోలు.. ఆ ఎన్టీఆర్ నుంచి, ఈ ఎన్టీఆర్ వ‌ర‌కూ. ఎవ‌రిని తీసుకొన్నా.. అంద‌రూ న‌ట‌న‌లో ఆరితేరిపోయిన‌వాళ్లే. డైలాగులు చెప్ప‌డంలో వాళ్ల త‌ర‌వాతే ఎవ‌రైనా! సాధార‌ణ‌మైన స‌న్నివేశాన్ని కూడా త‌మ‌దైన ప్ర‌తిభ‌తో క్లాసిక్‌గా మ‌ర్చేసిన ఘ‌ట్టాలెన్నో చూశాం. మ‌రీ ముఖ్యంగా కోర్టు సీన్లుల్లో నంద‌మూరి వారి ప్ర‌తిభ క‌నిపిస్తుంటుంది. కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పా?? అంటూ బొబ్బులి పులిలో ఎన్టీఆర్ కోర్టు సీనులో విజృంభించారు. అది.. ఓ క్లాసిక్‌గా నిలిచింది. కోర్టు సీన్ అంటే.. ముందుగా గుర్తొచ్చేది అది. ఇప్ప‌టికీ ఆ డైలాగుల్ని నంద‌మూరి అభిమానులు నెమ‌రు వేసుకొంటూనే ఉన్నారు. మొన్న‌టికి మొన్న టెంప‌ర్‌లో జూనియ‌ర్ కూడా అలాంటి కోర్టు సీనులోనే రెచ్చిపోయాడు.

అంత‌కు ముందు రాఖీలో అయితే ఎన్టీఆర్… అద‌ర‌గొట్టేశాడు. ఎన్టీఆర్‌లోని న‌టుడు పూర్తి స్థాయిలో బ‌య‌ట‌కు వ‌చ్చిన సినిమా అది. టెంప‌ర్ కూడా అంతే క‌దా?? ఇప్పుడు క‌ల్యాణ్ రామ్ కూడా కోర్టు సీనుల్లో త‌న ప్ర‌తాపం చూపించాడ‌ట‌. ఇజం సినిమాలో కల్యాణ్ రామ్ కోసం ఓ కోర్టు సీను తెర‌కెక్కించాడు పూరి. అందులో క‌ల్యాణ్ రామ్‌.. అద్భుతంగా న‌టించాడ‌ట‌. `కోర్టు సీన్ల‌న్నీ నంద‌మూరి వారి ఎకౌంట్‌లోకే` అంటూ ఇజం ఆడియో వేడుక‌లో స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు పూరి. ఈసీన్ ఎన్టీఆర్ చూశాడ‌ని, త‌న‌కు విప‌రీతంగా న‌చ్చేసింద‌ని చెప్పుకొచ్చాడు. టెంప‌ర్ విజ‌యంలో కోర్టు సీనుది కీల‌క‌మైన పాత్ర‌. అప్ప‌టి వ‌ర‌కూ సినిమా ఒక ఎత్తు. ఆ త‌ర‌వాత మ‌రో ఎత్తు. సేమ్ అదే సెంటిమెంట్ ఇజంకీ రిపీట్ అయితే… క‌ల్యాణ్ రామ్ ఖాతాలో హిట్టు ప‌డిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close