కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతోంది: మోదీ

భారతీయ జనతా పార్టీతో కలిసి లోపాయికారీ ఒప్పందంతో.. టీఆర్ఎస్ ఎన్నికల బరిలోకి దిగిందని వస్తున్న విమర్శలకు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… నిజామాబాద్‌లో తనదైన శైలిలో చరిత్రను కలిపి… కౌంటర్ ఇచ్చారు. అప్పుడెప్పుడో.. యూపీఏ హయాంలో.. కేసీఆర్ కేంద్రమంత్రిగా పని చేశారని గుర్తు చేసి.. యూపీఏ తిన్న వ్యక్తిగా కేసీఆర్‌ను అభివర్ణించింది.. కాంగ్రెస్‌తో ఆయన ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని విమర్శించారు. బీజేపీనే.. కేసీఆర్‌కు అసలైన ప్రత్యర్థి చెప్పుకోవడానికి..మోడీ తాపత్రయపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ వేర్వేరు కాదన్నారు. రెండూ కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. బీజేపీ – కాంగ్రెస్ నేతలది దొంగాట అని మండిపడ్డారు.

కేసీఆర్ పై మోడీ తీవ్ర విమర్శలే చేశారు. కేసీఆర్.. ఉప్పు, నిమ్మకాయల్ని మాత్రమే నమ్ముతారంటూ ఎద్దేవా చేశారు. బహుశా.. ముహుర్త బలం ప్రకారమే.. తనకు ఎన్నికల షెడ్యూల్స్, అసెంబ్లీ రద్దు తేదీలు కావాలని ఒత్తిడి చేసిన విషయాన్ని ప్రధానమంత్రి ఇలా గుర్తు చేసి ఉండవచ్చు. కాంగ్రెస్‌లో ట్రైనింగ్ తీసుకున్న కేసీఆర్ తెలంగాణను నాశనం చేశారని మండిపడ్డారు. అభద్రతా భావంతో ఉన్న కేసీఆర్‌ను.. తొమ్మిది నెలలు ముందుగానే ఇంటికి పంపించే అవకాశం వచ్చిందని పిలుపునిచ్చారు. కేసీఆర్ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని… ఆయన కాంగ్రెస్ మార్క్ అభివృద్ధి చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ , కరీంనగర్‌లను లండన్ చేస్తామన్నారని..కానీ.. నగరాలను నాశనం చేశారని విమర్శించారు. మోడీ.. పార్లమెంట్‌లో .. కేసీఆర్‌ను పొగిడిన దానికి భిన్నంగా… గట్టిగానే టీఆర్ఎస్‌ను విమర్శించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్‌తో బీజేపీకి ఏ సంబంధం లేదని చెప్పుకోవడానికి తాపత్రయ పడ్డారు.

బీజేపీ గురించి కూడా గొప్పగా చెప్పారు. ఇచ్చిన గ్యాస్ కనెక్షన్ల గురించి చెప్పారు. కేంద్ర పథకాల గురించీ చెప్పుకొచ్చారు. కానీ..తెలంగాణ విభజన హామీల విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జాతీయ అంశాలను కూడా ప్రస్తావించారు. విశేషం ఏమింటటే… చంద్రబాబు పేరు కానీ.. టీడీపీ పేరు కానీ.. మోడీ ఎత్తలేదు. ఇప్పటికే ఆంధ్రా ఓటర్లు బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న సమాచారం ఉండటంతో.. వీలైనంత వరకూ.. టీడీపీ ప్రస్తావన లేకుండా..మోడీ ప్రసంగం ముగించాలని.. అనుకున్నట్లుగా.. బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close