హరీష్, కేటీఆర్ శాఖలన్నీ కేసీఆర్ వద్దే..!

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను తెలంగాణ సీఎం కేసీఆరే.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా పది మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసినప్పటికీ.. ఎవరికీ ఆర్థిక శాఖ కేటాయించలేదు. గత మంత్రి వర్గంలో ఆర్థిక శాఖ నిర్వహించిన ఈటల రాజేందర్‌కు వైద్య, ఆరోగ్యశాఖ కేటాయించారు. మిగిలిన తొమ్మిది మంది మంత్రులకు… శాఖల కేటాయింపుల్లోనూ పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. జగదీష్‌రెడ్డికి విద్యాశాఖ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు పశుసంవర్ధక శాఖ, ఇంద్రకరణ్‌రెడ్డికు దేవాదాయ, అటవీ, న్యాయశాఖ, వేముల ప్రశాంత్‌రెడ్డికి రవాణా, రోడ్లు భవనాల శాఖ , నిరంజన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ, కొప్పుల ఈశ్వర్ కి సంక్షేమ శాఖ, చామకూర మల్లారెడ్డికి కార్మికశాఖ, శ్రీనివాస్‌ గౌడ్ కి ఎక్సైజ్‌, టూరిజం, క్రీడలు, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పంచాయతీరాజ్‌ శాఖ కేటాయించారు.

అత్యంత కీలకమైన శాఖలన్నీ తన దగ్గరే ఉంచుకున్నారు. ఆర్థికశాఖ, ఇరిగేషన్‌, ఐటీ, మున్సిపల్‌ శాఖలు కేసీఆర్ వద్దనే ఉన్నాయి. గతంలో ఐటీ , మున్సిపల్ శాఖలను కేటీఆర్, ఇరిగేషన్ ను.. హరీష్ రావు నిర్వహించారు. ఆ శాఖలను తన వద్దే అట్టి పెట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరగనున్న విస్తరలో ఈ శాఖలను కేటాయించే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై పూర్తి స్థాయి కసరత్తును… కేసీఆరే చేశారు. ఆయనే బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. ఇది ఓ రికార్డుగా నిలువనుంది.

మంత్రివర్గ శాఖ ల పునరేకీకరణ జరుగుతుందని.. అందుకే మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం అవుతోందని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పటి వరకూ చెప్పుకొచ్చాయి. కానీ.. అలాంటి ఏకీకరణ ఏమీ… జరగలేదు అన్ని శాఖలు అలాగే ఉన్నాయి. తక్కువ మంది మంత్రులు ఉన్నారు కాబట్టి.. పెద్దగా పని లేని శాఖలను.. ఎక్కువగా మంత్రులకు కేటాయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close