బడ్జెట్‌ కోసం మండలిని సమావేశపరిచేది లేదా..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు… ప్రారరంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 31వ తేదీలోపు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి ఆమోదింపచేసుకోవాల్సి ఉంది. లేకపోతే.. నిధుల వినియోగానికి అవకాశం ఉండదు. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అదే తేదీలోపు పూర్తి చేయాలి. లేకుండా.. నిధులు మురిగిపోతాయి. ఈ క్రమంలో..అసెంబ్లీనే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. అందరిలోనూ వస్తున్న సందేహం ఒక్కటే. శాసనసభను సమావేశ పరుస్తారు సరే.. మరి శాసనమండలిని సమావేశపరుస్తారా ..? లేదా..? అన్నదే. శాసనమండలిని రద్దు చేయాలని.. అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపారు.

కేంద్రం స్పందన ఏమిటో క్లారిటీ లేదు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన జగన్మోహన్ రెడ్డి… నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దుకు ఆమోద ముద్ర వేస్తారని.. పార్టీ నేతలకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుతం కేంద్రం నుంచి అలాంటి సూచనలేమీ లేవు. న్యాయశాఖ బిల్లు కూడా సిద్ధం చేయలేదు. పైగా.. అంతకు మించిన కీలక ఎజెండా కేంద్రానికి ఉంది. దీంతో.. శాసనమండలి బిల్లు ఆమోదం పొందడం కష్టమన్న అభిప్రాయం ఉంది. ఈ కారణంగా.. మండలిని కూడా సమావేశపర్చాల్సిన పరిస్థితి వస్తుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

అలా సమావేశపరిస్తే.. మండలి కార్యదర్శిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని..టీడీపీ పట్టుదలతో ఉంది. సమావేశపర్చకపోతే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని అంటున్నారు. సెలక్ట్ కమిటీ బిల్లుల వ్యవహారం కూడా సమావేశాల్లో తేలాల్సి ఉంది. గవర్నర్ ప్రసంగంలో ఆ బిల్లుల ప్రస్తావన ఉంటే.. మండలిలో సవరణలు కోరతామని.. టీడీపీ నేత యనమల స్పష్టం చేశారు. అలా సవరణలు కోరితే.. ప్రభుత్వానికి మరిన్నిచిక్కులు వస్తాయి…దీంతో..మండలి వ్యవహారం మరోసారి కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close