పుంగనూరుకు ఎవరూ వెళ్లకూడదా !?

పుంగనూరు . రాజకీయ దాడుల విషయంలో ఇటీవలి కాలంలో చాలా సార్లు ప్రచారంలోకి వచ్చింది. . వైఎస్ఆర్‌సీపీ నేతలు కాకుండా మరే పార్టీ నేత అయినా సరే అక్కడ తిరిగితే దాడులు చేయడమే వారి రాజకీయం. మాట్లాడితే ఇళ్లపై దాడులు చేస్తారు. ఆస్తులు ధ్వంసం చేస్తారు. ఊళ్లలోకి అడుగులు పెట్టనీయరు. ఇప్పుడు చంద్రబాబు పర్యటన విషయంలోనూ అదే జరిగింది. పుంగనూరులోకి చంద్రబాబును అడుగుపెట్టనీయలేదు.

పుంగనూరులో అత్యధికంగా దాడులకు గురయ్యే నేత ఎవరు అంటే.. టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబు. ఆయన ఏ గ్రామానికి వెళ్లే ప్రయత్నం జరిగినా ఏదో చోట దాడులు జరుగుతాయి. ఆయన పర్యటనలకు వెళ్లాలంటే కనీసం యాభై మంది కార్యకర్తలను తీసుకుని వెళ్తారు. లేకపోతే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని అనుకుంటారు. చల్లా బాబుకు కంటే ముందు టీడీపీ ఇంచార్జ్ గా అనూషా రెడ్డి ఉండేవారు. పేరున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఈ దాడుల రాజకీయాలను తట్టుకోలేక కన్నీరు పెట్టుకుని రాజకీయాల నుంచి విరమించుకున్నారు.

గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన రామచంద్ర యాదవ్.. ఆ పార్టీలో లేరు. కానీ ఆయన పుంగనూరు నియోజకవర్గంలో సొంతంగా రాజకీయం చేయడం ప్రారంభించారు. ఇటీవల కొత్త పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకోక ముందు ఆయన .. నియోజకవర్గంలో రైతుల సమస్యలపై పోరాడేందుకు తిరిగేవారు. ఆయన విస్తృతంగా పర్యటిస్తూండటంతో.. ఓ రోజు రెండు వందల మందితో కూడిన అల్లరి మూక ఇంటిపై విరుచుకుపడింది. విధ్వంసం సృష్టించింది. చివరికి ప్రాణాలు కాపాడుకున్న రామచంద్ర యాదవ్ .. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వై సెక్యూరిటీని ఏర్పాటు చేయించుకున్నారు. ఇటీవల సొంత పార్టీ పెట్టుకుని చిత్తూరు ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా పుంగనూరు వెళ్లడానికి ప్రయత్నిస్తే ఆయనను పోలీసులు ముప్పుతిప్పలు పెట్టారు.

పుంగనూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో ఇతర పార్టీల వాళ్లు నామినేషన్లు వేయడమే గొప్ప అన్నట్లుగా సాగిపోయింది. పంచాయతీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలే అత్యధికం. నామినేషన్ల ఉపసంహరణలోనూ ఆరోపణలు వచ్చాయి. ఈ అరాచకం అంతా పెద్దిరెడ్డి పెంచి పోషించే.. రెండు వందల మంది రౌడీల కనుసన్నల్లోనే ఉంటుందని పుంగనూరు జనం చెబుతూంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close