హెరిటేజ్ కేసులో కన్నబాబు, అంబటిలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు !

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్లుజారీ అయ్యాయి.హెరిటేజ్‌ సంస్థ వేసిన పరువు నష్టం కేసులో.. కన్నబాబు, అంబటి రాంబాబు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో ఇద్దరిపైనా హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఎనాన్‌బెయిలబుల్ వారెంట్‌ జారీ చేసింది. నిజానికి ఇది మొదటి సారి కాదు. మూడో సారి . అయినా వారు కోర్టుకు హాజరు కావడం లేదు. వారెంట్లను పోలీసులు అమలు చేయడం లేదు.

గతంలో హెరిటేజ్ కంపెనీపై ఇన్ సైడర్ ట్రేడింగ్ అని.. మజ్జిగ ప్యాకెట్లు అని రకరకాల ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబు, కన్నబాబు ఎక్కువగా ఈ ఆరోపణలు చేశారు. వీటిపై హెరిటేజ్ సంస్థ కోర్టులో పరువు నష్టం కేసులు నమోదు చేసింది. మొదట్లో ఎన్ని సార్లు విచారణ జరిగినా హాజరు కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న జరిగే విచారణకు తప్పని సరిగా హాజరై వ్యక్తిగత పూచీకత్తు, రూ.5 వేలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను పాటించలేదు. మార్చిలో జరిగిన విచారణకూ హాజరు కాలేదు. అలా వరుసగా విచారణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ హాజరు కావడం లేదు.

గురువారం జరిగిన విచారణకూ ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు గైర్హాజరయ్యారు. దీంతో వారిద్దరిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. కొసమెరుపేమిటంటే.. హెరిటేజ్ ప్రతినిధులూ విచారణకు హాజరు కావడంలేదు. హెరిటేజ్‌ ప్రతినిధి సాంబమూర్తి కూడా హాజరుకావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ అక్టోబరు 7కి వాయిదా వేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close