కేసీఆర్ పై గెలుపు ఖాయం… ఓట్ల శాతంపై ఒంటేరు అనుమానం!

తెలంగాణ అధినేత కేసీఆర్ పై తాను భారీ మెజారిటీతో గెల‌వ‌బోతున్న‌ట్టు ధీమా వ్య‌క్తం చేశారు కూట‌మి అభ్య‌ర్థి ఒంటేరు ప్ర‌తాప‌రెడ్డి. ఇ.వి.ఎమ్‌.లు టాంప‌రింగ్ అవుతున్నాయ‌న్న అనుమానాలు తమకు ఉన్నాయ‌నీ, అందుకే వీవీ ప్యాట్ల ద్వారా వ‌చ్చే ప్రింటింగ్ స్లిప్పుల‌ను కూడా ఓట్ల లెక్కింపులో భాగంగా లెక్కించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని కోరామన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించార‌నీ, 24 గంట‌ల్లో దీనిపై తాము స్పందిస్తామ‌ని అధికారులు హామీ ఇచ్చార‌న్నారు. తెరాస‌కు కొంత‌మంది పోలీసులు స‌హ‌క‌రిస్తున్నారంటూ అనుమానం వ్య‌క్తం చేశారు ఒంటేరు.

గజ్వేల్ నియోజక వర్గంలో 88 శాతం పోలింగ్ అయింద‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంత పోలింగ్ జ‌రిగిందీ అనేది ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ఇంత‌వ‌ర‌కూ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేద‌న్నారు. దాన్లో ఏదో మ‌త‌ల‌బు జ‌రుగుతోంద‌నీ, సాంకేతికంగా అన్ని ర‌కాల సౌక‌ర్యాలు అందుబాటులో ఉన్న‌ప్పుడు గంట‌లోపుగా ఓటింగ్ శాతం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందనీ, కానీ ఎందుకింత జాప్యం జ‌రుగుతోంద‌ని ప్రశ్నించారు. తాము చాలా క‌ష్ట‌ప‌డి ఎన్నిక‌ల‌ను ఎదుర్కొన్నామ‌నీ, రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి త‌మ‌కు సానుకూల స్పంద‌న ఉంద‌నీ, కేసీఆర్ మీద తాను 40 నుంచి 50 వేల మెజారిటీతో గెలుస్తున్నాను అని ధీమాగా చెప్పారు ఒంటేరు. త‌న గెలుపు ఖాయ‌మ‌నే వాతావ‌ర‌ణం ఉండటంతో తెర వెన‌క తెరాస ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింద‌ని అనుమానాలు ప్ర‌జ‌ల‌కూ క‌లుగుతున్నాయ‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి గెల‌వ‌బోతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా ఉంది కాబ‌ట్టే ఏదో జ‌రుగుతోంద‌న్నారు.

కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ… ఎన్నిక‌లు జ‌రిగి 24 గంట‌లు గ‌డిచినా కూడా పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేక‌పోయారు! కింది స్థాయిలో అధికారుల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం కొట్టొచ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. అదే కారణమని అధికారులు చెబుతున్నారు. నిజానికి, తెలంగాణ‌లో మొత్తం 31 జిల్లాలున్నాయి, అవి కూడా చిన్న‌చిన్న జిల్లాలు. అంటే, స‌మాచారం మ‌రింత వేగ‌వంతంగా రావాలి. ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోస‌మ‌నే క‌దా ఇన్ని కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసింది. అయినాస‌రే, జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోలింగ్ శాతం అధికారికంగా లెక్క‌గ‌ట్టి చెప్ప‌డానికి ఇంత ఆల‌స్యం కావ‌డం… స‌హ‌జంగానే కొన్ని అనుమానాల‌కు అవ‌కాశం ఇస్తుంది. శ‌నివారం రాత్రికైనా ఈ లెక్క‌ల‌పై స్ప‌ష్ట‌త వ‌స్తుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘క‌న్న‌ప్ప‌’ సెట్లో బాహుబ‌లి

మంచు విష్ణు ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో సౌత్ ఇండియ‌న్ స్టార్ల‌తో పాటు, బాలీవుడ్ స్టార్లు కూడా అతిథి పాత్ర‌ల్లో మెర‌వ‌బోతున్నారు. అక్ష‌య్‌కుమార్ శివుడి పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే....

ప్రచారంలో వైసీపీ ఇంత తేలిపోయిందేంటి !?

రాజకీయ ప్రచారం వ్యూహాత్మకంగా ఉండాలి. ప్రజల్లో మూమెంట్ తెచ్చేది ప్రచారమే. ప్రచారంలో ముందున్నారు అన్న అభిప్రాయం కలిగితే ప్రజల మూడ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. కానీ వైసీపీ ఈ ప్రచారం విషయంలో పూర్తిగా...

వైసీపీని చిత్తుగా ఓడించండి…త్రివిక్రమ్ పిలుపు

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు డైరక్టర్ త్రివిక్రమ్. ఏపీ పాలిట ఉగ్రవాదుల్లా మారిన వైసీపీని ఓడించి, కూటమిని గెలిపించాలన్నారు. త్రివిక్రమ్ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఉంది. పవన్ కళ్యాణ్...

ఇంకా పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఎలా జ‌గ‌న్‌?

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై జ‌గ‌న్ రెడ్డికి ఉన్న క‌సి రోజు రోజుకీ ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న ఎప్పుడొచ్చినా దత్త పుత్రుడు, నాలుగు పెళ్లిళ్లూ అంటూ ఈ రెండే రెండు ముక్క‌లు మాట్లాడి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close