ఇతర పార్టీల ట్రాప్‌లో పడొద్దు – క్యాడర్‌కు జనసేనాని సందేశం !

సోషల్ మీడియాలో జనసనపై జరుగుతున్న పొత్తుల మైండ్ గేమ్ విషయంలో పవన్ కల్యాణ్ క్యాడర్‌కు స్పష్టమైనసూచనలు చేశారు. తాను చెప్పిన విషయాలను మాత్రమే ప్రజలకు చెప్పాలని.. ఎవరో చేసే ప్రచారాల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలని పవన్ కల్యామ్ ప్రశ్నించారు. తనను కలిసిన పార్టీ నాయకులకు ఇదే చెప్పారు. పార్టీ క్యాడర్‌ అదే సమాచారం ఇవ్వాలని కూడా దిశానిర్దేశం చేశారు. మనం చేసేది చెబుదాం. పొత్తులు, ఎత్తులపై మనకంటూ ఒక లైన్ ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాజకీయాలు ఒక ఎత్తు, మనం చేసే రాజకీయం మరో ఎత్తని ఇతర పార్టీల ట్రాప్‌లో పడకూడదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చాలా డిఫరెంట్, ఇతర రాజకీయ పార్టీలు వేరు మన జనసేన పార్టీ వేరు, మన మీద కేసులు లేవు. అవినీతి ఆరోపణలు అంత కంటే లేవు. కుంభకోణాలకు ఆస్కారమే లేదు. పూర్తి పారదర్శకంగా పార్టీని నడుపుతున్నాం. ఇవే మన రక్షణ కవచాలు అని నేతలకు పవన్ వివరిస్తున్నారు. కే ఇప్పటి వరకు పరిస్థితులు వేరు, ఇప్పడు పరిస్థితులు వేరు కాబట్టి రాజకీయాల్లో మనం నిలబడాలంటే ముందుగా ఎదుటి వారి ట్రాప్‌లో పడకూడదని పవన్ పదే పదే చెబుతున్నారని ఆయనను కలిసిన నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం.. అనవసరంగా జనసైనికులు జోక్యం చేసుకుంటున్న వైనంపై అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు.

ఎదైనా పార్టీ నుంచి పిలుపు ఉన్నా, రాజకీయ అప్ డేట్ ఉన్నా అధినేతగా తాను ఎదైనా నిర్ణయం తీసుకున్నా ఆ వివరాలు అన్నింటిని అధికారికంగా విడుదల చేస్తామని . వాటినే పరిగణంలోకి తీసుకోవాలని సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో పార్టీ నాయకులను కలిసేందుకు కూడా పవన్ ప్రత్యేకంగా సమయం ిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల షెడ్యూల్స్ పూర్తి కాగానే వారాహి యాత్ర ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సర్వేలు కూడా చేయిస్తున్నానని పవన్ చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close