ప్రభుత్వానిది కూడా తప్పుందన్న పవన్ కళ్యాణ్

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న తునిలో జరిగిన పరిణామాలపై స్పందించారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తాను నిన్న ఉదయమే హైదరాబాద్ నుంచి షూటింగ్ కోసం కేరళ వెళ్ళానని చెప్పారు. దీనిగురించి తెలియగానే వెనకకు వచ్చాని తెలిపారు. నిన్న ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమని అన్నారు. ఇది తనకు బాధ కలిగించిందని చెప్పారు. ఏ సమస్యనయినా శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని తాను భావిస్తానని అన్నారు. కాపులు బ్రిటిష్ కాలంనుంచి బీసీలుగా ఉన్నారని చెప్పారు. బీసీల్లో చేర్చాలనే డిమాండ్ కాపుల్లో చాలాకాలంనుంచి ఉందని అన్నారు. తమను ఓటుబ్యాంక్‌గా వాడుకుంటున్నారని కాపుల్లో బాధ ఉందని చెప్పారు.

రైలు అగ్గిపుల్ల వేస్తే కాలిపోదని అన్నారు. ఖచ్చితంగా కుట్రతోనే జరిగిందని చెప్పారు. దీనివెనక ఖచ్చితంగా అసాంఘిక శక్తులు ఉన్నాయని అన్నారు. ఎవరి ప్రోద్బలమో తనకు ఇంకా తెలియదని చెప్పారు. తునిలో ఇంత పెద్ద సభకు ఇన్ని లక్షలమంది హాజరవుతారని తెలిసికూడా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని అన్నారు. సమస్యను బాగా పెద్దదయ్యేవరకు చూసి అప్పుడు చర్యలు తీసుకోవటం మనకు బాగా అలవాటయిందని పవన్ చెప్పారు. ఉద్యమనేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని అన్నారు. తాను ఒక కులానికి ప్రతినిధిని కానని చెప్పారు. తాను జాతీయ సమగ్రత కోసమే రాజకీయాలలోకి వచ్చానని అన్నారు. ప్రభుత్వం ఉద్యమనేతలతో చర్చలు జరిపి వారికి నమ్మకం కలిగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close