తిరుపతి అభివృద్ధి, రాష్ట్ర మేలు కోసమే ఈ నిర్ణయం: పవన్ కళ్యాణ్

తిరుపతి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈలోగానే బిజెపి నేతలు పలువురు తిరుపతి ఎంపీ స్థానానికి జనసేన బీజేపీ కూటమి తరపున బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని ప్రకటించారు. సహజంగానే ఈ నిర్ణయం జనసేన అభిమానులకు నిరాశ కలిగించింది. ఇటీవలే జిహెచ్ఎంసి ఎన్నికల్లో, నామినేషన్ వేసిన తర్వాత కూడా బిజెపి విజ్ఞప్తి మేరకు జనసేన తమ అభ్యర్థులను బరిలో నుండి తప్పించిన సంగతి తెలిసిందే. ఇలా ప్రతిసారి బిజెపి కోసం జనసేన సీట్లు వదులుకోవడం జనసైనికులకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు తిరుపతి స్థానానికి బిజెపికి మద్దతు ఇవ్వడానికి గల కారణాలను వివరిస్తూ పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేశారు.

ముందుగా తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగనున్న ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయంపై పలు దఫాలుగా అటు బీజేపీ జాతీయ నాయకత్వంతో, ఇటు రాష్ట్ర నాయకత్వం తోనూ చర్చలు జరిగాయని చెప్పిన పవన్ కళ్యాణ్, ఆధ్యాత్మిక నగరంగా ఉన్న తిరుపతి ని అభివృద్ధి చేస్తామని బిజెపి బలమైన హామీ ఇచ్చిందని, తిరుపతి అభివృద్ధి, రాష్ట్రానికి జరిగే మేలు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దానికి తోడు ఇటీవలికాలంలో ఆలయాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి స్థానంలో బిజెపి నిలబడడం సముచితంగా ఉంటుందని భావించినట్లు పవన్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వైఎస్ఆర్సిపి ఆగడాలకు దీటయిన సమాధానం చెబుతామని, జిహెచ్ఎంసి ఎన్నికల మాదిరిగా తిరుపతి ఉప ఎన్నిక కూడా జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని బిజెపి నాయకులు హామీ ఇచ్చిన కారణంగా ఈ సీటు బిజెపి పార్టీకి వదులుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

అయితే ఇటీవల కొంతకాలంగా జనసేన అభిమానులు తిరుపతిలో జనసేన కి సీట్ ఇవ్వకపోతే తాము బిజెపి పార్టీకి మద్దతు ఇవ్వము అని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, వారిని సముదాయించే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లు లేఖలో స్పష్టం అవుతోంది. దూరదృష్టితో జనసేన కార్యకర్తలు ఆలోచించాలని, తిరుపతిలో విజయం కోసం సమష్టిగా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ తన అభిమానులను ప్రత్యేకంగా అభ్యర్థించారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న బంధాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్నది భవిష్యత్తులో తేలుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close