కాపులకు మంచి చేసేది నేనే : పవన్ కల్యాణ్

కాపుల్లో ఐక్యత లేకపోవడం వల్లే రాజకీయ సాధికారత సాధించలకేపోతున్నారని పవన్ కల్యాణ్ కకీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేనకు చెందిన ప్రతినిధులతో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాపుల ఆత్మగౌరవాన్ని తగ్గించబోమని… జనసేనను నమ్మిన వారి ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తగ్గించబోమన్నారు. కాపులంతా ఐక్యంగా ఉండాలని కట్టుబాటు చేసుకోవాలన్నారు. అధికారంలో ఉన్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు గౌరవం ఇచ్చితీరాలి. గొడవ పెట్టుకుంటే ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెడతారనే భయం ఉంటుందిన్నారు. ఇటీవల జరుగుతున్న ప్రచారం కారణంగా తాను లోపాయికారి ఒప్పందాలకు లొంగిపోనని ప్రకటించారు.

కుళ్లు, కుతంత్రాలు, కుట్రలు లేకుండా రాజకీయం లేదన్నారు. వెయ్యి కోట్లు ఉన్నా రాజకీయాలు చేయలేమని .. పార్టీని నడపలేమని.. భావజాలం ఉంటనే పార్టీని నడపగలమన్నారు. రాయలసీమలో మైన్స్ మొత్తం సీఎం కుటుంబం చేతుల్లో ఉందని.. బలిజలు నోరు ఎత్తలేరన్నారు. ఆ మైన్స్ అన్నీ ఒకప్పుడు బలిజలేవనని గుర్తు చేశారు. దీనికి కారణం ఐక్యత లేకపోవడంమేనన్నారు. కాపులు పార్టీ నడపలేరని ఎవరైనా అంటే.. చెప్పు తెగేలా సమాధానం చెప్పాలన్నారు. వీటన్నింటినీ ఎదుర్కోవడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. తానేం మెత్తటి మనిషిని కాదన్నారు.

సంఖ్యాబలం ఉన్నా రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరడంలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వతా రిజర్వేషన్ల గురించి మాట్లాడటం లేదని… మండిపడ్డారు. కాపులవైపు నిలబడబోమని చెప్పినా ఓటేసినా గెలిపించారని.. కుల ఆత్మగౌరవాన్ని కాదని కూడా ఎందుకు ఓటేసి గెలిపించారని ప్రశ్నించారు. ప్రస్తుతం అధికార పార్టీని ఎదిరిస్తే.. మానసికంగా శారీరకంగా హింహిస్తారన్నారు. కాపు సంఘాలన్నింటినీ ఐక్యత చేసుకుంటే దక్షిణ భారతదేశంలో కీలక పాత్ర పోషిస్తామన్నారు. కాపులకు ేదైనా మంచి జరగాలంటే అది తానే చేయగలనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

తాను ఓడిపోతే తొడకొట్టిన వాళ్లు కాపు నేతలేనని విమర్శించారు. మీరు మీరు కొట్టుకు చావండి అని వైసీపీ నేతలంటున్నారని… ఐక్యత ఉంటేనే ఏదైనా చేయగలమన్నారు. కాపుల దగ్గర ఆర్థిక బలం తక్కువన్నారు. అందుకే ఏకమవ్వాలని పవన్ పిలుపునిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close