జనసేనాని స్పందన ఏది..?

రాజధానిపై ఇంత రచ్చ జరుగుతున్నా.. జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిండం లేదు. ఓ ట్వీట్ కానీ.. మరో మీడియా ప్రకటన కానీ.. ఆయన దగ్గర్నుంచి రావడం లేదు. రాజధాని విషయంలో పవన్ కల్యాణ్.. మొదటి నుంచి ఎగ్రెసివ్ గా ఉన్నారు. జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత చిరంజీవి…మూడు రాజధానులకు మద్దతుగా ప్రకటన చేసిన రోజునే.. దానికి భిన్నంగా మరో ప్రకటన చేశారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత స్పందిస్తానని చెప్పారు. అప్పట్నుంచి పవన్ కల్యాణ్ స్పందించడం లేదు. దీంతో.. రాజకీయవర్గాల్లో వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి.

అయితే పవన్ కల్యాణ్ ప్రస్తుతం దేశంలో లేరని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ ఏటా ఆయన.. క్రిస్మస్ కోసం.. తన సతీమణి అన్నా లెజ్‌నోవా సొంత దేశానికి వెళ్తారు. ఆమె సొంత దేశం ఏదో ఎవరికీ పెద్దగా తెలియకపోయినప్పటికీ.. యూరప్ అని మాత్రం చెబుతారు. గత ఏడాది ఎన్నికల మూడ్ ఉన్న సమయంలోనే.. ఆయన క్రిస్మస్ ట్రిప్ కోసం.. యూరప్ వెళ్లారు. అక్కడ చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్న వీడియోలు, ఫోటోలను జనసేన విడుదల చేసింది కూడా. ఈ సారి మాత్రం… పవన్ కల్యాణ్.. విదేశీ పర్యటనకు వెళ్లిన విషయాన్ని కూడా జనసేన వర్గాలు అధికారికంగా చెప్పలేదు.

క్రిస్మస్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్..అమరావతి విషయంలో తన కార్యాచరణ ప్రకటిస్తారని జనసేన వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం.. ఇప్పటికీ.. విశాఖకు రాజధానిని తరలించాలనే ఆలోచన చేస్తోందని… అందరూ నమ్ముతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునేలా… ఉద్యమం చేసేందుకు పవన్ సిద్ధమవుతారని అంటున్నారు. తను విదేశీ పర్యటనలో ఉన్నందున… తన సోదరుడు నాగబాబును అమరావతి రైతుల వద్దకు పంపారు. పవన్ వచ్చిన తర్వాత ఆయనే.. అమరావతిలో పర్యటించే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close