కలెక్టర్ రాకపోతే జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తారట పేర్ని నాని !

ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తాననే ధైర్యం విపక్ష నేతలకే ఉండదు. ఎందుకంటే ఆయన ఇంటికి మూడు, నాలుగు కిలోమీటర్ల ముందే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. కానీ మాజీ మంత్రి.. వైసీపీ నేత మాత్రం తమ నేతల్ని తీసుకెళ్లి మరీ జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తానంటున్నారు. వేరే పార్టీ అధికారంలో ఉందేమో అని ఆ క్షణంలో అనుకున్నారేమో అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలోనే ఆయన మంత్రిగా చేశారు. ఆయనేవరో కాదు పేర్ని నాని. కలెక్టర్ ఓ సమావేశానికి రాలేదని.. తాను సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తానని ప్రకటించారు.

ఉమ్మడి క్రిష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ఆర్కే రోజా, జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కొత్త జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఇతరులు హాజరు అయ్యారు. గతంలో క్రిష్ణా జిల్లాలో ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు జిల్లాల విభజన తర్వాత ప్రస్తుతం ఏలూరు జిల్లాలో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కూడా హాజరు కావాల్సి ఉంది. గతంలోనూ ఆయన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఇవాళ్టి సమావేశానికి కూడా రాకపోవడంతో ఎమ్మెల్యే పేర్ని నాని అగ్రహం వ్యక్తం చేశారు.

ఏలూరు కలెక్టర్ ప్రసన్నం వెంకటేష్ మరోసారి జెడ్పీ సమావేశానికి రాకపోతే కనుక జిల్లాకు చెందిన జెడ్పీటీసీ మెంబర్లందరితో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి వద్ద ధర్నా చేస్తామంటూ పేర్ని నాని అందరి ముందే వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై సమావేశంలో తీర్మానం కూడా చేయాలని పేర్నినాని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉన్న వైసీపీ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. అసలు జగన్ కు ఏం సంబంధం అని.. ఈ విషయంలో జగన్ ప్రస్తావన ఎందుకు తెచ్చారని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. తాను వచ్చే ఎన్నిక్లలో పోటీ చేయబోనని చెబుతున్న పేర్ని నాని వ్యవహారశైలి ఇటీవలి కాలంలో కాస్త భిన్నంగానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close