ఎమ్మెల్యేల ఎర కేసు సీబీఐ చేతికి వెళ్తే !?

ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ విచారణకు.. నిందితుల వైపు నుంచి మరో ప్రయత్నం జరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా సిట్ ప్రకటించి..విచారణకు రాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేసిన తుషార్‌ వెల్లపల్లి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సీఎం కేసీఆర్ రాజకీయ అజెండా ప్రకారం సిట్ విచారణ చేస్తోందని నిష్పాక్షిక విచారణ కోసం సీబీఐకి ఇవ్వాలని ఆయన అంటున్నారు. తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని.. దాన్ని బయట పెట్టకుండా లుకౌట్ నోటీసలు జారీ చేశారని ఆయన కోర్టుకు ఆధారాలు సమర్పించారు.

కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌, అధికార ప్రతినిధి అనిల్‌ బలూనీ, క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఓం పాఠక్‌ల బృందం సైతం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు కోరుతూ అక్టోబర్‌ 28న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తుషార్‌ సైతం సీబీఐకి అప్పగించాలని హైకోర్టుకు వెళ్లారు. గతంలో పలు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయంగా హైప్రోఫైల్ కేసులు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి … సీబీఐ చేతికి చాలా సార్లు వెళ్లాయి.

ఇప్పుడు తుషార్ పిటిషన్ ద్వారా.. హైకోర్టు సానుకూలంగా స్పందిస్తే.. కేసు సీబీఐ చేతిలోకి వెళ్తుంది. అప్పుడు ఇంకా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. నలుగురు ఎమ్మెల్యేలు ప్రధానంగా నిందితులవుతారు. సీన్ రివర్స్ అయిపోతుంది. అందుకే… ఈ కేసు విషయంలో… బీజేపీ … సీబీఐ విచారణ కోసం దండయాత్ర చేస్తోంది. ఆ పార్టీ చేతనైనంతగా చేస్తుందన్నదాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ కేసు తెలంగాణకే పరిమితం కాలేదు. దేశం మొత్తం సిట్ విచారణ చేస్తోంది. సహకరించడం లేదని… హైకోర్టులోనే పిటిషన్లు వేస్తోంది. ఈ కారణంగానే… దేశవ్యాప్తగా అధికారం ఉన్న సీబీఐతో విచారణ చేయించాలన్న వాదనను నిందితులు వినిపింవచ్చు. పొరపాటును కేసు సీబీఐకి వెళ్తే.. సీన్ మారిపోయినట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close