పోలవరం పూర్తి కాదు – హోదా రాదు ! వైసీపీ ఎంపీలకు ఇదేం ఆనందం ?

పోలవరంపై ఏం జరుగుతుందో వైసీపీ ఎంపీలకు స్పష్టంగా తెలుసు. కేంద్రం మొండికేసింది. కనీసం బతిమాలే చాన్స్ కూడా ఇవ్వడం లేదు. అసలు జగన్ అడగడమే మానేశారు. ఇక హోదా గురించి చెప్పాల్సిన పని లేదు. అయినా వీటి గురించి వైసీపీ ఎంపీలు పదే పదే పార్లమెంట్‌లో ప్రశ్నలు అడుగుతున్నారు. లేదు..రాదని చెప్పిస్తున్నారు. తాజాగా.. వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ .. ఈ రెండింటిపైనా రాజ్యసభలో ప్రశ్నించారు. దానికి ఎప్పట్లాగే కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు.

నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమని బోస్‌కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అంతే కాదు…పోలవరంకు కేంద్రం ఇవ్వాల్సింది కేవలం రూ. 2,441 కోట్లు మాత్రమేనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇటీవలే జగన్ అర్జంట్‌గా పదివేల కోట్లు కావాలని లేఖ రాశారు. దాన్ని మడిచి ఎక్కడ పడేశారో కూడా స్పష్టత లేదు. ఇవ్వాల్సింది అంతేనని తేల్చేశారు. అదే సమయంలో ప్రత్యేకహోదాపైనా పిల్లి బోస్ ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే పన్నుల వాటాను పెంచడమే కాకు.. ఎవరికైనా లోటు ఉంటే భర్తీ చేస్తున్నామని..ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

అటు పోలవరం పూర్తి కాదు.. హోదా రాదు అని వైసీపీ ఎంపీ మరోసారి కేంద్రం ద్వారా చెప్పించినట్లయింది. ఇలా ఎందుకు చేస్తారో స్పష్టత లేదు కానీ.. మొదటి నుంచి వైసీపీ ఎంపీల తీరు ఇలాగే ఉంది. వాటిపై ఆశలు వదిలేసుకోమని ప్రజలకు సందేశం పంపాలని అనుకుంటారో.. లేకపోతే.. తామే పోరాడుతున్నట్లుగా కలరింగ్ ఇన్నాలనుకుంటారో కానీ.. తమ చేతకాని తనాన్ని ఎలివేట్ చేసే ప్రస్నలే ఎక్కువగా అడుగుతూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close