కరోనా కొరడా : తెలంగాణ పోలీసుల సీరియస్ యాక్షన్

తెలంగాణ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఆదివారం నాడు ఇళ్ల నుంచి బయటకు రాని ప్రజలు సోమవారం నాడు తండోపతండాలుగా రోడ్లపైకి వచ్చేశారు. దీంతో వారిని సముదాయించి ఇళ్లకు పంపడం పోలీసులకు కష్టసాధ్యమైంది. దీంతో సోమవారం సాయంత్రం వరకూ ఎలాంటి చర్యలకు తావివ్వని పోలీసులు రాత్రి మాత్రం తమ నిబంధనల కొరడా బయటకు తీసారు. తెలంగాణ రాజధానితో సహా పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లో 1058 మోటారు సైకిళ్లు, 948 ఆటోలు, 449 కార్లు, 2480 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాజధాని పరిధిలోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో 73 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మంగళవారం నాడు ఈ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ మాత్రమే ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ సమయంలోనే రైతు బజార్లు, కిరాణా దుకాణాలు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి 31 వరకూ ప్రజలు నిబంధనలకు వ్యతిరేకంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బాలీవుడ్ తారలు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ సందేశాలు ఇస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని వ్యాపార సంస్థలు ప్రజలను నిలువునా ముంచేలా ధరలను పెంచేశాయి. మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకూ ప్రజలు నియమ నిబంధనలు పాటించకపోతే సీరియస్ చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు కూడా హెచ్చరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close