ప్ర‌భాస్ కోసం కొత్త ప్ర‌పంచం

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా – యూవీక్రియేష‌న్స్ ఓ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డేక‌థానాయిక‌గా న‌టిస్తోంది. రాధాకృష్ణ ద‌ర్శ‌కుడు. ఇట‌లీ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ఇది. ఇది వ‌ర‌కే విదేశాల్లో కొంత భాగం తెర‌కెక్కించారు. హైద‌రాబాద్‌లోనూ కొంత‌మేర షూటింగ్ సాగింది. ఈరోజు నుంచి అన్న‌పూర్ణ స్డూడియోస్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభ‌మైంది. ఇందుకోసం అన్న‌పూర్ణ‌లో కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించారు ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ఎస్‌.ర‌వీంద‌ర్ రెడ్డి. ఈ సినిమా కోసం ఓ చెరువునే త‌వ్వేశారు. అందులో ప‌డ‌వ‌పై ప్ర‌భాస్‌, పూజా హెగ్డేలు రొమాన్స్ చేసుకునే స‌న్నివేశాల్ని ఈరోజు నుంచి తెర‌కెక్కించ‌బోతున్నారు. దాదాపు ఎక‌రం విస్తీర్ణంలో ఈ చెరువు సృష్టించి, అందులో ఓ బోట్‌పై స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. దాదాపుగా 4 రోజుల పాటు ప్ర‌భాస్ – పూజాల‌పై ఈ స‌న్నివేశాలు తీయ‌బోతున్నారు. ఆ త‌ర‌వాత‌.. రైలు నేప‌థ్యంలో ఇంకొన్ని సీన్స్ తీస్తారు. ఇది వ‌ర‌కే అన్న‌పూర్ణ‌లో ఈ సినిమా కోసం ట్రైన్ సెట్ వేశారుర‌వీంద‌ర్‌. 2021 వేస‌విలో ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. ఇది వ‌ర‌కు `జాన్‌` అనే పేరు పెడ‌దామ‌నుకున్నారు. కానీ `జానూ` వ‌చ్చేయ‌డంతో `రాధే శ్యామ్‌` అనే పేరు ఖ‌రారు చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close