ఏపీ ఆర్థిక శాఖ ” ప్రైవేటీకరణ “

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ పూర్తిగా ప్రైవేటీకరణ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర క్యాడర్ కాని ఓ అధికారి నేతృత్వంలో మొత్తం నడుస్తోంది. ఆయనకు తోడు కన్సల్టెంట్లు అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. తాజాగా ఆర్థిఖశాఖలో జాయింట్ సెక్రటరీ స్థాయిలో ప్రైవేటు వ్యక్తుల్ని నియమించనున్నారు. దీనికి సంబంధించి ఇంటర్యూలు కూడా పూర్తి చేశారు. నిజానికి జాయింట్ సెక్రటరీ అంటే.. ప్రభుత్వంలో చాలా కీలకం. ఆర్థిక వ్యవహారాలు మొత్తం వారి కనుసన్నల్లో నడవాలి. అందుకే అలాంటి పోస్టుల్లో ఇప్పటి వరకూ ఔట్ సోర్సింగ్ వారినీ కానీ.. కాంట్రాక్ట్ వారినీ కానీ నియమించలేదు.

కానీ ఇప్పుడు నేరుగా ప్రైవేటు ఉద్యోగులకు ఇంటర్యూలుకు నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. దీంతో ఏపీలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలకు మరింత స్కోప్ పెరుగుతుందన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రైవేటు ఉద్యోగులు అంతా ఎవరో కాదని… వైసీపీ నేతల కంపెనీల్లో ఫైనాన్స్ విభాగాల్లో కీలకంగా పని చేస్తున్న వారేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారికే ఇంటర్యూలు నిర్వహించారని అంటున్నారు. అయితే వారి పేర్లేమిటి… వారి నేపధ్యం ఏమిటి అన్నవి ఇంకా బయటకు రాలేదు. కానీ ఉద్యోగులు మాత్రం వారంతా ఓ మిషన్‌పై చేరుతున్నారన్న ఆందోళనలో ఉన్నారు.

ప్రైవేటుగా చేరే ఉద్యోగులు చేసే వ్యవహారాలు ఎలాంటివి అయినా ఆ తప్పుల బాధ్యతలు ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగులపై పడతాయి. చేయాల్సినదంతా చేసి వారి దోవన వారు వెళ్తారు. కానీ పరిణామాలను ఎదుర్కోవాల్సింది మాత్రం అక్కడే ఉండాల్సిన ఉద్యోగులే. ఉద్యోగ సంఘం నేతలు పూర్తిగా ప్రభుత్వ చెప్పు చేతల్లో ఉండటంతో గట్టిగా ప్రభుత్వానికి నిరసన తెలిపే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close