ఈవీఎంల మొరాయింపు, నేతల ఫైర్‌

ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. చాలా మంది సెలబ్రెటీలు, సామాన్య ప్రజలు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పలుచోట్ల ఈవీఎం మిషన్లు మొరాయించడం పై, ఏర్పాట్లు సరిగా లేకపోవడం పై నేతలు ఫైర్ అయ్యారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంక నిజామాబాద్ ఎంపీ కవిత స్వగ్రామం లో ఈవిఎం మిషన్లు సరిగ్గా పనిచేయకపోవడం కారణంగా గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దీనిపై కవిత కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక విశాఖపట్నంలో జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పోలింగ్ నిర్వహణపై విమర్శలు చేశారు. ప్రజలు ఉదయాన్నే వచ్చినప్పటికీ, ఈవీఎం మిషన్లు పనిచేయకపోవడంతో దాదాపు గంటన్నరపాటు ఓటర్లు క్యూలో ఉన్నారు. సిబ్బంది నుండి సరైన సమాధానం కూడా ఎవరూ ఇవ్వకపోవడంతో లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పిసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కూడా ఉదయం 7 గంటలకే ఓటు వినియోగించుకోవడానికి వెళ్లినప్పటికీ, ఈవీఎం మెషిన్ లు పనిచేయకపోవడంతో చాలాసేపు వేచి ఉన్నారు. ఇక గుత్తిలో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా, ఇవిఎంలు చాలా సేపు పని చేయకపోవడంతో ఆగ్రహం తో ఈవీఎంలు నేలకేసి కొట్టారు. దీంతో పోలింగ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా జనసేన అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

ఈవీఎంలు మొరాయించడం, ఎలక్షన్ కమిషన్ పై అధికారులు అనేక ఫిర్యాదులు చేయడం, ఇటీవలి కాలంలో ఈవీఎంలపై సందేహాలు పెరగడం – ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ పనితీరుపై, వారి సమగ్రతపై ప్రజలకు అనుమానాలు కలిగిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించడం, అనుమానాలను నివృత్తి చేయడం లో ఎన్నికల సంఘం ఏమరపాటు ప్రదర్శిస్తే ప్రజలలో అనుమానాలు మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం కోల్పోయినా సరే కానీ… జగన్ టార్గెట్ అదే..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా వైసీపీ...

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close