పూరి జగన్.. ఓ మాటల గన్! పూరి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడంటే అందులో సగం క్రెడిట్ అతనిలోని రచయితకు ఇవ్వాల్సిందే. ఒక్కో మాటనీ తూటాలా వదులుతాడు. మామూలు మాటలాంటిదే అయినా… దానికి అంతటి శక్తి ఉంటుంది. మనం మాట్లాడుకొనే మాటలానే అనిపిస్తున్నా ఆటం బాంబులా పేలుతుంటుంది. అయితే గత కొన్నేళ్లుగా పూరి పెన్ పవర్ సరిగా బయటకు రావడం లేదు. పూరిలో పదును తగ్గిపోయిందేంటి చెప్మా?? అని అతని అభిమానులు కూడా డీలా పడుతున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమాలూ తుస్సుమంటున్నాయి. టెంపర్లో వైఫై డైలాగ్ తప్ప.. పేలినవి చాలా తక్కువ. అయితే ఇజంలో పూరిలోని రైటర్ పూర్తి స్థాయిలో బయటకు వచ్చాడేమో అనే నమ్మకం కలుగుతోంది. ట్రైలర్, టీజర్లలో వదిలిన డైలాగులేం లేవు. అయితే ఓ పాటలో మాత్రం మళ్లీ పూరి కనిపించాడు.
ఇజం టైటిల్ సాంగ్ స్వయంగా రాశాడు పూరి. ‘ఒకడ్ని మించినోడు ఒకడు.. సాలేగాళ్లు.. బ్లాక్ లో కొందామన్నా మంచోళ్లు దొరకట్లా.. ` అంటూ సాగే ఈ పాట పూరీనే పాడాడు కూడా. బ్లాక్లో కొందామన్నా మంచోళ్లు దొరకడం లేదు అనేది పూరి స్థాయి, శైలి చెప్పేమాట. ఈ సినిమా ఉద్దేశం మొత్తం వివరించే మాట. ‘చావండ్రా దేశం కోసం.. అంత కంటే గొప్ప పనే ముంది?? ‘ అనే మాట ఇన్స్టెంట్ గా ఎక్కేస్తుంది. పైగా ఇది జర్నలిజం చుట్టూ తిరిగే కథ. మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికీ బోల్డన్ని సంగతులు ఉండనే ఉంటాయి. పూరి మనసు పెట్టి రాయాలే గానీ చెలరేగిపోవడం ఖాయం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో చాలా మట్టుకు డైలాగులు మళ్లీ మళ్లీ కోడ్ చేసుకొనే స్థాయిలో వచ్చాయట. క్లైమాక్స్ లో పూరి తాలుకు పెన్పరర్ తెలుయబోతోందని టాక్. డైలాగులతో సినిమాలు హిట్టవ్వవుగానీ… ఓ యావరేజ్ సినిమాని మాత్రం హిట్టు స్థాయికి తీసుకెళ్తాయి. ఇజం దాన్ని మరోసారి నిజం చేయాలని కోరుకొందాం. పూరీ అభిమానులు