మళ్లీ ఆరెస్సెస్‌కు వెళ్లిపోయిన రామ్‌మాధవ్..!

బీజేపీలో ఓ వెలుగు వెలిగిన రామ్‌మాధవ్ దీపం ఇప్పుడు ఆరిపోయింది. ఆయనను ఆరు నెలలుగా పార్టీలో ఏ పదవి లేకుండా పక్కన పెట్టడం.. ఏ బాధ్యతా అప్పగించకపోవడంతో.. ఆయన మళ్లీ తన మాతృ సంస్థ ఆరెస్సెస్‌కు వెళ్లిపోయారు. ఆయనను ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గంలో సభ్యుడిగా నియమించారు. దీంతో రామ్ మాధవ్ రాజకీయ కలలన్నీ కల్లలుగా మారిపోయినట్లయింది. ఆరెస్సెస్‌లోకీలక స్థానం నుంచి .. ఏకాఏకిన బీజేపీలో ప్రధాన కార్యదర్శి పదవికి వెళ్లిన రామ్ మాధవ్ ఆ తర్వాత పార్టీలో కీ రోల్ ప్లే చేశారు. ఈనాశ్య రాష్ట్రాల్లో బీజేపీ పతాకం ఎగరడం వెనుక ఆయన పాత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామ్‌మాధవ్‌ దక్షిణాదిలోనూ రాజకీయాలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనను అప్పుడప్పుడూ పొగుడుతూ ఉంటారు.

ఓ సందర్భంలో అమిత్ షా తర్వాత బీజేపీకి కాబోయే అధ్యక్షుడు రామ్ మాధవేనన్న ప్రచారం జరిగింది. ఆయన పలుకుబడి ఆ స్థాయిలో ఉండేది. అయితే అనూహ్యంగా ఆయనను మోడీ, షా దూరం పెట్టడం ప్రారంభించారు. పీడీపీతో పొత్తు.. కశ్మీర్ లో వైఫల్యం వంటి వాటికి ఆయనను బాధ్యుడ్ని చేశారు. ఆ తర్వాత పార్టీ పదవి తీసేశారు. రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఆయనను పార్టీ పదవి నుంచి తీసేసిన సమయంలో రాజ్యసభ సీటు ఇచ్చిన కేంద్రమంత్రిని చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ దాని గురించీ పట్టించుకోలేదు. ఇక బీజేపీలో భవిష్యత్ లేదనుకోవడం.. మోడీ, షా ఏ మాత్రం సానుకూలంగా లేకపోవడంతో.. ఆరెస్సెస్ కూడా.. ఆయనను మళ్లీ వెనక్కి పిలిపించాలని నిర్ణయించుకుని ఆ మేరకు బాధ్యతలిచ్చినట్లుగా తెలుస్తోంది.

బీజేపీలో ఎదగాలంటే.. ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. రామ్‌మాధవ్‌కు అది పుష్కలంగా ఉంది. మంచి వ్యూహకర్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. కానీ.. ఆరెస్సెస్‌కు మోడీ, షాలకు మద్య గ్యాప్ పెరిగిందని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రామ్ మాధవ్‌ను వారిద్దరూ పట్టించుకకోపవడం… మళ్లీ ఆయన ఆరెస్సెస్‌కు వెళ్లిపోవడం.. బీజేపీ అంతర్గత రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. రామ్ మాధవ్‌తో పాటు మురళీధర్ రావు కూడా ఆరెస్సెస్ నుంచి ఒక్క సారే బీజేపీలోకి ప్రధాన కార్యదర్శి పదవిలోకి వచ్చారు. ఆయనకూ పార్టీ పరమైన బాధ్యతలేమీ లేవు కానీ… ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో చక్కబెట్టడానికి ఏదో ఓ పని చెబుతూ ఉంటారు. దీంతో ఆయన మాత్రం ఇంకా బీజేపీలోనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close