పంతం నెగ్గించుకున్న రమణదీక్షితులు..! మళ్లీ అదే పోస్టు..!

ఎన్నికలకు ముందు.. తెలుగుదేశం పార్టీ సర్కార్ పై పింక్ డైమండ్ ఆరోపణలు చేసి.. ప్రధానార్చకులుగా .. బలవంతంగా రిటైర్మెంట్ అయిపోయిన శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు.. కొత్త ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల తర్వాత మరోసారి పదవి లభించింది. న్యాయవివాదాల దృష్ట్యా ఆయనకు ప్రధాన అర్చక పదవి ఇవ్వడం సాధ్యం కాబట్టి.. గౌరవ ప్రధాన అర్చకులు అనే పదవిని టీటీడీ పాలక మండలి సృష్టించింది. ఆ పదవిలో రమణదీక్షితులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోకి మళ్లీ ప్రధాన అర్చకునిగా అడుగు పెట్టాలనుకున్న రమణదీక్షితుల కోరిక.. ఏడు నెలల తర్వాత తీరుతోంది. ఆయనను.. ఏ పదవిలోకి తీసుకోవడం సాధ్యం కాదని.. టీటీడీ బోర్డు చాలా కాలంగా చెబుతూ వస్తోంది. ఆయన చేసిన వివాదాలు.. వేసిన కేసుల కారణంగా. సమస్యలు ఉంటాయని చెప్పుకొచ్చింది.

అయితే.. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు.. ఆయనను మళ్లీ ప్రధాన అర్చకుని పదవిలో నియమిస్తామని హామీ ఇచ్చారు. జగన్ గెలిచిన తర్వాత పలుమార్లు రమణదీక్షితులు.. ఆయనను కలిసి తనకు ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించారు. కానీ సాంకేతికంగా మళ్లీ. ప్రధాన అర్చకుని హోదాలో తీసుకోవడం సాధ్యం కాదని.. చెప్పి.. ఆగమ సలహాదారు పదవి తీసుకోవాలని సూచించారు. తర్వాత గౌరవ ప్రధానార్చకుని పదవి సృష్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. కొద్ది రోజుల కిందట..ఆగమసలహాదారుగా పదవి చేపట్టారు. ఇప్పుడు గౌరవ ప్రధాన అర్చకులుగా నియమితులయ్యారు. ఇప్పటికే. తన కుమారులు ఇద్దర్ని.. తిరుమల ఆలయానికి బదిలీ చేయించుకున్నారు.

ఆయన కుమారులు.. వెంకటకుమార దీక్షితులు, రాజేష్ దీక్షితులు వంశపారంపర్య అర్చకత్వం ప్లస్ పాయింట్‌తో.. టీటీడీలో చేరారు. అయితే.. వారు విధులకు హాజరు కావడం లేదు. ఇప్పటికే ఆయన బద్ద విరోధిగా భావించే డాలర్ శేషాద్రి. మరో సారి పొడిగింపు తెచ్చుకున్నారు. రిటైరైన ఉద్యోగులందర్నీ తీసేసినా.. డాలర్ శేషాద్రిని మాత్రం తొలగించలేకపోయారు. ఆలయంలో.. మళ్లీ రెండు వర్గాల పోరాటం ప్రారంభమవుతుందన్న ఆందోళన.. టీటీడీలో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close