సస్పెన్స్ కోసం ఇంత రిస్కా రావణాసుర ?

థ్రిల్లర్స్ సినిమా చూడటడానికి ఆసక్తికరంగా వుంటాయి. అయితే ఆ థ్రిల్ ని హోల్డ్ చేయడం ఎంత కష్టమో.. స్పాయిలర్స్ బయటికిరాకుండా చూసుకోవడం కూడా అంతే కష్టం. ఈ జోనర్ తో మరో ఇబ్బంది.. ఒక్కసారి సస్పెన్స్ వీడిపోయిన తర్వాత ఆడియన్స్ రిపీట్ అవ్వరు. ఎలాంటి క్లూ లేకుండా మొదటిసారి, అదీ మొదటి షో చూడటంలోనే థ్రిల్లర్స్ మజా.

ఇప్పుడు రవితేజ రావణాసుర కూడా థ్రిల్లర్ గావస్తోంది. ఇప్పటివరకూ సస్పెన్స్ ని బాగానే హోల్డ్ చేశారు. ఇదంతా కేలవం మొదటి రోజు మొదటి ఆట చూసే ప్రేక్షకుల కోసమే. ఈ సోషల్ మీడియా యుగంలో తొలి ఆట అయిన వెంటనే ఎదో రూపంలో మలుపులు, సస్పెన్స్ బయటికి వచ్చేస్తాయి.

అయితే ఆ మొదటి ఆట థ్రిల్ కోసం రావణాసుర నిర్మాతలు పెద్ద రిస్క్ చేశారు. దిని కోసం ఏకంగా మిగతా భాషల విడుదల కూడా ఆపుకున్నారు. ఇలాంటి జోనర్ సినిమాలకి అన్ని భాషల్లో మార్కెట్ వుంటుంది. కానీ రావణాసుర ఆ ఛాన్స్ తీసుకోలేదు. దీనికి కారణం.. సస్పెన్స్ వీడిపోతుందని. ఈ విషయాన్ని దర్శకుడు సుధీర్ వర్మ స్వయంగా చెప్పారు. ”హిందీ, తమిళ్ లో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ వాళ్ళకి పదిహేను రోజులు ముందు కాపీ పంపించాలి. అయితే మేము ఏదైతే దాస్తూ వచ్చామో ఆ ఎలిమెంట్స్ బయటికి వచ్చేస్తాయనే భయంతో ముందు తెలుగులోనే విడుదల చేయాలని అనుకున్నాం. తెలుగు ఆడియన్స్ మేము పొందిన ఎక్సయిట్ మెంట్ పొందాలి” అని చెప్పుకొచ్చారు.
మరి సస్పెన్స్ ని రివిల్ చేయొద్దని చూసిన ప్రేక్షకులకు చెబుతారా ? అనే ప్రశ్నకు.. మనం చెబితే వింటారా ? అలా అయితే వాళ్ళని బుజ్జగించిమరీ చెబుతాను” అని నవ్వేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close