ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఓబులాపురం కేసు నుంచి బయటపడ్డారని అందరూ అనుకున్నారు. ఈ కేసులో శిక్షలు ఖరారు అయిన తరవాత రోజే ఆమెకు సుప్రీంకోర్టు నుంచి బ్యాడ్ న్యూస్ అందింది. ఈ కేసు నుంచి గతంలో శ్రీలక్ష్మి హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. కానీ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఈ కేసులో.. తీర్పుతో సంబంధం లేకుండా శ్రీలక్ష్మి పాత్రపై విచారణ చేయాలని ఆదేశించింది. మరో నెలల్లో విచారణ చేయాలని సూచించింది.
గాలి జనార్ధన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో మైనింగ్ శాఖను శ్రీలక్ష్మి చూస్తూంటారు. లీజుల్లో అవకతవకలు దగ్గర నుంచి గాలి జనార్ధన్ రెడ్డి కి అర్హత లేకపోయినా లీజులు కట్టబెట్టడం వరకూ చాలా తప్పులు ఆమె చేతులు మీదుగా జరిగాయని సీబీఐ ఆరోపించారు. గాలి జనార్ధన్ రెడ్డి నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందినట్లుగా చార్జిషీటు దాఖలు చేశారు అయితే ఆమె తనకేం సంబంధం లేదని మొదటి సీబీఐ కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. కానీ సీబీఐ కోర్టు కొట్టి వేసింది. అదే పిటిషన్ ను హైకోర్టులో వేశారు. 2022లో ఆమెను కేసు నుంచి డిశ్చార్డ్ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.
అయితే హైకోర్టు తాము చూపించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుడా డిశ్చార్జ్ చేశారని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. మూడు నెలల్లోగా విచారణ చేయాలని సూచించింది. అంటే.. ఈ కేసులో ఒక్క శ్రీలక్ష్మి విషయంలోనే నేరం చేశారా లేదా అన్నది విచారణ జరిపి శిక్ష ఖరారు చేయనున్నారు