అధికారుల హంటింగ్ ఉండదు : రేవంత్ రెడ్డి

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌కు సహకరిస్తున్న అధికారుల పేర్లను రెడ్ బుక్‌లో రాసుకున్నామని .. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తూ ఉండేవారు. ఎన్నికల ప్రచారంలో కూడా అదే చెప్పారు. అందుకే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మంది కీలక పొజిషన్లలో ఉన్న అధికారులు రేవంత్ ను కలిసేందుకు మొహమాటపడ్డారు. వారంతా బీఆర్ఎస్ తో ఓపెన్ గా కలిసి పనిచేశారు. ప్రతిపక్ష నేతలు.. ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై కూడా వేధింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు వారంతా కంగారు పడుతున్నారు.

స్మితా సభర్వాల్, జయేష్ రంజన్, అర్వింద్ కుమార్ వంటి అధికారులు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ ను కలవడానికి సంకోచిస్తున్నారు. సంప్రదాయానికైనా వచ్చి అభినందనలు చెప్పలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి అలాంటి అధికారులందరికీ భరోసా ఇస్తున్నారు. అధికారుల హంటింగ్ ఉండదని మీడియా చిట్ చాట్‌లో చెప్పుకొచ్చారు. అయితే బదిలీలు మాత్రమే ఉంటాయన్నారు. ఆ బదిలీలల్లో కూడా పైరవీలు ఉండవని స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో కమిషనర్లుగా నియమితులైన వారిలో ఒక్కరు కూడా పోస్టింగ్ కోసం తనను కలవలేదన్నారు. రేవంత్ రెడ్డి మాటలు.. బీఆర్ఎస్ తో కలిసి పని చేసిన వారికి కాస్త ధైర్యం ఇస్తున్నాయని అనుకోవచ్చు. ఏపీలో అధికారుల్ని.. ఎలా ఉపయోగించుకున్నారో.. వారిలో వారిైప కేసులు పెట్టడానికి తప్పుడు స్టేట్ మెంట్లు కూడా ఎలా ఇప్పించుకున్నారో తెలంగాణ ఐఏఎస్ అధికారులు కూడా కథలు కథలుగా చెప్పుకుటున్నారు.

అక్కడ ప్రభుత్వం మాత్రం నిండా మునిగిపోయేవారు ఉన్నారని.. కానీ ఇక్కడ మాత్రం అధికారుల హంటింగ్ ఉండదని నేరుగా సీఎం చెప్పడంతో రిలీఫ్ ఫీలవుతున్నారు. రెడ్ బుక్ ను రేవంత్ రెడ్డి లోపల పెట్టేసినట్లేనని నమ్మకంగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close