రేవంత్ అంతే – టీడీపీ సానుభూతిపరులను ఇట్టే ఆకట్టుకుంటాడు !

తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదు. ఎందుకు పోటీ చేయడం లేదన్నది రకరకాల చర్చలు ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే.. బీఆర్ఎస్, బీజేపీకి సెటిలర్లు ఓట్లు వేయవద్దని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారిలో టీడీపీ ఫ్యాన్స్ ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని.. ఆయనకు సపోర్ట్ చేయాలన్న వాదనను వినిపిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందో లేదో కానీ.. ఆయన మాత్రం టీడీపీ సానుభూతిపరులను ఆకట్టుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వచ్చినా వదిలి పెట్టడం లేదు. హైదరాబాద్ లో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి అవసరం లేకపోయినా చంద్రబాబును పొగిడారు.

అమరావతి గురించి గొప్పగా చెప్పారు. టీడీపీ సానుభూతిపరులు రేవంత్ రెడ్డి అంటే మాకు ఇందుకే ఇష్టం అని చెప్పుకోకుండా ఎలా ఉంటారు ? వైఎస్ గొప్ప నేత అన్నట్లుగా ఇండియా టుడే యాంకర్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఆయన మాత్రమే కాదని.. చంద్రబాబు, జైపాల్ రెడ్డి, పీవీ లాంటి వాళ్లు ఇంకా గొప్పనేతలు ఉన్నారని తేల్చేశారు. తర్వాత హైదరాబాద్ ను కూడా ఆమరావతిలా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. అమరావతి నది ఒడ్డున ఉంటుంది.. అద్భుతమైన ప్రాజెక్టు అని అన్నారు. ఆ తరహాలోనే మూసిని అభివృద్ధి చేసి.. హైదరాబాద్ ను కూడా రివర్ ఫ్రంట్ సిటీగా అభవృద్ధి చేయాలన్న ఆలోచనలు ఉన్నట్లుగా చెప్పారు. రేవంత్ మాటలు వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వెళ్లిపోయినా .. చంద్రబాబును ఎప్పుడూ విమర్శించారు.

ఈ విషయంపై తనపై బీఆర్ఎస్ తో పాటు ఇతర నేతలు నిందలేసినా పట్టించుకోరు. అందుకే.. టీడీపీ సానుభూతిపరులు మొదటి నుంచి రేవంత్ కు సపోర్ట్ గా ఉంటారు. ఈ సారి టీడీపీ పోటీలో లేకపోవడం వల్ల దీన్ని మరింత అడ్వాంటేజ్ గా తీసుకునేందురు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలిస్తాయో లేదో మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close