బషీర్‌బాగ్ కాల్పుల పాపం కేసీఆర్‌దేనా ?

బషీర్ బాగ్ కాల్పులు అనే మాట వినిపిస్తే.. అందరూ అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు వైపు చూస్తారు. ఆ స్థాయిలో ఆయనపై వ్యతిరేక ప్రచారం జరిగింది. అంత కంటే దారుణంగా ముదిగొండలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కాల్పులు జరిగాయి ఎవరూ పట్టించుకోరు. కానీ.. బషీర్ బాగ్ .. వార్షికోత్సవాలు మాత్రం.. ఇక్కడ బీఆర్ఎస్.. అక్కడ వైసీపీ చేసి.. చంద్రబాబును నిందిస్తూనే ఉంటాయి.

అసలు ఆ కాల్పులకు కారణం కేసీఆర్ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. అప్పట్లో ఏం జరిగిందా అని.. ఆరా తీస్తున్నారు. విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా అప్పట్లో ఉద్యమం జరిగింది. బషీర్ బాగ్ దగ్గరకు వచ్చే సరికి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి దారి తీసిన పరిస్థితులు కేసీఆర్ వల్లే వచ్చాయని తాజాగా రేవంత్ రెడ్డి ఆరోపించారు.

విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజలపై కాల్పులు జరిపించింది అప్పట్లో టీడీపీలో కీలకంగా ఉన్న కేసీఆర్‌ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాల్సి ఉంటుందని నాడుచంద్రబాబు అనడానికి కారణం కేసీఆరే అన్నారు. అప్పట్లో టీడీపీలో మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌డీ) చైర్మన్‌గా ఉండి ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కుదరదని చంద్రబాబుతో చెప్పించారనన్నారు. దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా రేవంత్ ప్రదర్శించారు.

రేవంత్ వ్యాఖ్యలు ఒక్క సారిగా కలకలం రేపాయి. వెంటనే బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేశారు. రేవంత్ వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయన్నారు. టీడీపీని గెలిపించడానికే ఇలా మాట్లాడుతున్నారంటూ ఎదురుదాడి చేశారు. రేవంత్ తాను అనని మాటల్ని..అన్నట్లుగా ట్విస్ట్ చేసి బీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తే.. బషీర్ బాగ్ కాల్పుల్ని ..కేసీఆర్ కు లింక్ పెట్టి.. రేవంత్ ఇచ్చిన కౌంటర్ తో బీఆర్ఎస్ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఇది టీడీపీ నేతలకు కూడా మంచి అస్త్రం అవుతోంది. ఇప్పటి వరకూ ఆ నిందను తిప్పికొట్టలేకపోయారు టీడీపీ నేతలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close