కోర్టుకు వెళ్లే పూచీ తీసుకున్న రేవంత్‌రెడ్డి!

తెలుగుదేశం పార్టీనుంచి ఎమ్మెల్యేలు తెరాసలోకి ఫిరాయిస్తే.. వారి మీద అనర్హత వేటు వేయాలంటూ స్పీకరుకు ఫిర్యాదుచేసి, ఆయన పట్టించుకోవడం లేదంటూ కోర్టుకు వెళ్లి కేసులు నడిపే బాధ్యత ఇదివరలో అయితే ఎర్రబెల్లి దయాకర్‌రావు తీసుకునే వారు. ఇప్పుడు ఆయన కూడా ఫిరాయించేసిన తర్వాత.. ఆ పని రేవంత్‌రెడ్డి వాటాకు వచ్చినట్లుంది. తెలంగాణ అసెంబ్లీలో ఫ్లోర్‌లీడర్‌గా ఎర్రబెల్లి ఖాళీచేసిన సీటు దక్కించుకున్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఫిరాయించిన వారి మీద అనర్హత వేటు వేయించేలా కోర్టును ఆశ్రయించే బాద్యత కూడా నెత్తికెత్తుకుంటున్నారు.
తెరాసలో చేరిపోయిన పది మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు.. తమదే అసలైన తెలుగుదేశం అని, తాము తెరాసలో విలీనం అయిపోయినట్లుగా గుర్తించాలని కోరుతూ స్పీకరు మధుసూదనాచారికి లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో.. రేవంత్‌రెడ్డి తమ పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలతో టీడీఎల్పీ ఆఫీసులో మీటింగు పెట్టుకున్నారు. నిజానికి ఈ సమావేశానికి వచ్చింది నలుగురే. ఆర్‌.కృష్ణయ్య డుమ్మా కొట్టారు.

ఆ తర్వాత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గతంలో ఇచ్చిన అయిదు ఫిర్యాదులు స్పీకరు వద్ద పెండింగులో ఉన్నాయని, ఇప్పుడు అయిదుగురిపై మళ్లీ ఫిర్యాదు ఇచ్చామని.. వీటిపై నిర్ణయం తీసుకోకుండా.. విలీనం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్నప్పటికీ కూడా.. విలీనం చేసేయడం అనేది రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదని కూడా రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. శాసనమండలిలో కూడా తెదేపా సభ్యులు తెరాసలో విలీనం అయినట్లుగా చెప్పడం కరెక్టు కాదని వాదిస్తున్నారు. ఈ విషయంలో మండలి ఛైర్మన్‌ తన పరిధి దాటి వ్యవహరించారని రేవంత్‌రెడ్డి అంటున్నారు. గతంలో యూపీలో ఇదే తరహాలో మండలిలో విలీనం అయినట్లు గుర్తిస్తే.. అది చెల్లదంటూ సుప్రీం కోర్టు కొట్టేసిందని చెబుతున్న రేవంత్‌రెడ్డి.. తెలంగాణ మండలిలో జరిగిన నిర్ణయాన్ని కూడా కోర్టులో సవాలు చేస్తాం అంటున్నారు.

నిజానికి ఫిరాయింపుల నిరోధక చట్టానికి వాజపేయి హయాంలో జరిగిన మార్పుల ప్రకారం మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్నప్పటికీ కూడా.. విలీనం అనే ప్రక్రియ రాజ్యాంగపరంగా సాధ్యం కాదంటూ న్యాయనిపుణులు కూడా సెలవిస్తున్నారు. అయితే మరి ఫిరాయించిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏ ధైర్యంతో శుక్రవారం ఉదయం లేఖ ఇచ్చారో తేలడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close