పంచ‌భూతాలు… పంచ గాయ‌కులు

ఓ పాట‌ని ఇది వ‌ర‌కు ఒకే గాయ‌కుడు పాడే వాడు. ఆ త‌ర‌వాత వెరైటీ కోసం ఇద్ద‌రు గాయ‌కుల‌తో పాడించ‌డం మొద‌లెట్టారు. ఈసారి ఒకే పాట‌ని అయిదుగురు గాయ‌కుల‌తో పాడించారు. `సాక్ష్యం` కోసం. కాక‌పోతే.. ఈ పాట ఓ కాన్సెప్ట్ ప్ర‌కారం సాగిపోతుంద‌ట‌. పంచ‌భూతాల నేప‌థ్యంలో న‌డిచే క‌థ `సాక్ష్యం`. పంచ‌భూతాల విశిష్ట‌త‌ను చెబుతూ ఓ పాట కంపోజ్ చేశారు ఈ సినిమాలో. అది సినిమాలో అక్క‌డ‌క్క‌డ సంద‌ర్భానుసారం వ‌స్తుంటుంది. ఈ పాట‌ని అయిదుగురు గాయ‌కుల‌తో పాడించారు. ఎస్‌.పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, జేసుదాస్‌, హ‌రిహ‌ర‌న్‌, కైలాష్ ఖేర్‌, బోంబే జ‌య‌శ్రీ ఈ పాట‌ని ఆల‌పించారు. అయిదుగురూ పెద్ద గాయ‌కులే. అనంత శ్రీ‌రామ్ ఈ పాట‌ని అందించారు. ఓ థీమ్ ప్ర‌కారం సాగే ఈ పాట‌.. సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్, పూజా హెడ్గే జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి శ్రీ‌వాస్ ద‌ర్శ‌కుడు. జులై 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close