తేజూ.. బ్యాక్ టు సెట్స్

‘ఇంటెలిజెంట్’ రిజల్ట్ నుంచి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ త్వరగా బయటపడ్డాడు. సినిమా విడుదలైన తర్వాత తేజూ ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యాడు. పది రోజుల్లో అతడి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఈ రోజు (సోమవారం) నుంచి కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ఆదివారం రాత్రి యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగిన ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్‌కి తేజూ అటెండ్ అయ్యాడు. అలాగే, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించే సినిమా గురించి కూడా ఆదివారం అనౌన్స్ చేయించాడు. ఆ సినిమా షూటింగ్ మేలో మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈలోపు కరుణాకరన్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి తేజూ ప్లాన్ చేస్తున్నాడు. ఏప్రిల్ నెలాఖరుకి కరుణాకరన్ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.