సుప్రీమ్ హీరోతో హ్యాట్రిక్‌

సుప్రీమ్ కోసం సాయిధ‌ర‌మ్ తేజ్ – రాశీఖ‌న్నా తొలిసారి జోడీ క‌ట్టారు. ఆ సినిమా హిట్ట‌య్యింది. ప్ర‌తీ రోజూ పండ‌గేలోనూ ఈ జంట అల‌రించింది. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ కాంబినేష‌న్‌ని చూసే అవ‌కాశం వ‌స్తోంది. సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌లే ఓ చిత్రం క్లాప్ కొట్టుకుంది. నివేదా థామ‌స్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో మ‌రో హీరోయిన్‌కీ అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం రాశీఖ‌న్నా పేరు ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్‌. తాను కొన్ని స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట‌నీ పంచుకోబోతోంద‌ని తెలుస్తోంది. సాయిధ‌ర‌మ్ తో రాశీఖ‌న్నా న‌టించిన రెండు సినిమాలూ హిట్ట‌య్యాయి. వాళ్ల‌మ‌ధ్య కెమిస్ఠ్రీ కూడా బాగుంటుంది. అందుకే… ఆ సెంటిమెంట్‌తో రాశీఖ‌న్నా పేరు ఖ‌రారు చేసే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close