ఒట్టు ..ముందస్తు లేదంటున్న వైసీపీ !

సీఎం జగన్ రెడ్డి ఇలా ఢిల్లీ వెళ్లి అలా మోదీ, షాలతో గుసగుసలాడి రాగానే.. జాతీయ మీడీయాలో ఐదు రాష్ట్రాలతో పాటు ఆరో రాష్ట్రంగా ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించేసింది. జగన్ అదే మాట్లాడారని చెప్పేశాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇదంతా టీడీపీ నేతలు ఆడుతున్న మైండ్ గేమ్ అని ప్రజా తీర్పు ప్రకారం చివరి రోజు వరకూ పాలన చేస్తామని చెబుతున్నారు. ఎంత మంది చెప్పినా నమ్మడం లేదని.. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పారు.

ముందస్తు రావాలనేది చంద్రబాబు ప్లాన్ అని సజ్జల చెప్పుకొచ్చారు. ముందస్తు రావాలా వద్దా అన్నది చంద్రబాబు చేతుల్లో లేదు. ఉంటే ఖచ్చితంగా ముందస్తు ఉండేదమో ఎందుకంటే.. ఆయన ఎన్నికలు ఎప్పుడు పెట్టినా గెలిచేస్తామన్న ధీమాగా ఉన్నారు. కానీ వైసీపీ మాత్రం ఎన్నికలకు వెళ్లే ప్రశ్నే లేదంటోంది. చంద్రబాబు , పవన్ కల్యాణ్ ముందస్తు రావాలని కోరుకుంటున్నారని.. తమకు అలాంటి ఆలోచనలే లేవని చెప్పుకొస్తున్నారు . అసెంబ్లీని రద్దు చేస్తే బీజేపీ సహకారం విషయంలో అనుమానాలు ఉండటంతోనే..వైసీపీ వైపు నుంచి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.

పార్లమెంట్ తో పాటు ఎన్నికలు జరిగితే.. తమ ఎన్నికల అజెండా మొత్తం మారిపోతుందని వైసీపీ నేతలు భయపడుతున్నారు. జాతీయ అంశాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. బీజేపీతో కలుపుగోలుగా ఉండి సాధించిందేమిటన్న ప్రశ్నలు ప్రజల ముందుకు వస్తాయి. ఐదేళ్లలో రాజధాని నిర్వీర్యం అయిపోయింది..పోలవరం పడకేసింది. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇవన్నీ లేకుండా సంక్షేమమే టాపిక్ గా ఎన్నికలకు వెళ్లాలంటే ప్రత్యేకంగా అసెంబ్లీ ఎన్నికలు జరగాలని వైసీపీ కోరుకుంటోందన్న చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close