ఎన్నికలొస్తే చావు రాజకీయాలు – వైఎస్ ఆత్మకు శాంతి లేదా ?

జగన్ రెడ్డి అండ్ కో మళ్లీ వైఎస్ మరణంపై అనుమానాలు ఉన్నాయని ప్రారంభించారు. ఒకప్పుడు తమకు సీఎం పదవి ఇవ్వలేదని కుటుంబం మొత్తం… కాంగ్రెస్ పై పడిపోయారు. తమ కుటుంబం ఆ స్థాయిలో ఉండటానికి కారణం కాంగ్రెస్ అని మర్చిపోయి ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. సోనియానే చంపించిందన్నారు. రిలయన్స్ తో కలిసిఈ దారుణం చేశారన్నారు. లెక్కలేనన్ని ఆరోపణలు చేశారు. అంతా చేసి ఇప్పుడు తల్లి ,కూతురు కాంగ్రెస్ పార్టీ పంచలో చేరిపోతే.. జగన్ రెడ్డి మాత్రం… కొత్త కథలు వండుతూనే ఉన్నారు.

వైఎస్ మరణంపై అనుమానాలున్నాయని సజ్జల కొత్తగా ఆరోపణలు ప్రారంభించారు. ఆయనకు సిగ్గు వేయదేమో కానీ.. వినేవాళ్లకు కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది. రిలయన్స్ కు చెందిన పరిమళ్ నత్వానీకి వైసీపీ పార్టీ తరపున రాజ్యసభ సీటు ఇచ్చి ఎమ్మెల్యేలతో ఓటు వేయించినప్పుడే జగన్ రెడ్డి తన తండ్రి ఆత్మను తీవ్రంగా కదిలించారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు అశాంతి రేపుతున్నారు.

తండ్రి ప్రమాదవశత్తూ మరణిస్తే.. ఆ మరణాన్ని అడ్డం పెట్టుకుని దాన్నే పెట్టుబడిగా మార్చుకుని రాజకీయం చేస్తున్నారు జగన్ రెడ్డి. ఎన్ని ఎన్నికలు వచ్చినా అదే పరిస్థితి. తండ్రి ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారని విమర్శలు వచ్చినా ఆయన శైలి ఆయనదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close