సజ్జల సలహాదారు పదవికి గండం..!?

సలహాదారుగా ఉండి రాజకీయాలు మాట్లాడటం ఏమిటని ఏపీ హైకోర్టు ఆశ్చర్యపోయింది. నీలం సాహ్నిని సలహాదారుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు సలహాదారులదే రాజ్యం. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే సలహాదారు మొత్తం చక్రం తిప్పుతున్నారు. ప్రతీ దానికి మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రకటిస్తున్నారు. ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తానే ఒంటి చేత్తో నడుపుతున్నట్లుగా షో చేస్తున్నారు. ఆయన తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

కోర్టులో వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి గతంలో ఏజీగా పని చేశారు. అదే విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేస్తూ.. ఆ సమయంలో సలహాదారులు రాజకీయాలు మాట్లాడేవారా.. అని ప్రశ్నించారు. సీవీ మోహన్ రెడ్డి కూడా అలాంటిదేమీ లేదని కోర్టుకు చెప్పాల్సి వచ్చింది. దీంతో అసలు సలహాదారులు ఎవరు.. ఎలా నియమిస్తారు…వారి పనులేంటో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ప్రభుత్వానికి సలహాదారుల చిక్కు వచ్చి పడే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సలహాదారులు ఉన్నారు. అయితే చాలా మంది… గతంలో వైసీపీ కోసం పని చేస్తూ.. గత ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు ప్రతిఫలంగానే ఇచ్చారు. మరికొంత మందికి సాక్షి మీడియాలో జీతాల భారం తగ్గించుకోవడానికి ఇచ్చారన్న ప్రచారం ఉంది. వీరెవరూ పెద్దగా మీడియా ముందుకు రారు.

సలహాలు కూడా ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. కానీ సజ్జల.. ఆయన నిర్దేశిస్తే.. అజేయ కల్లాం మాత్రం మీడియాతో మాట్లాడతారు. కోర్టు ఆక్షేపణ దృష్ట్యా… సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు పదవికి రాజీనామా చేసినా ఆయనకు పోయేదేమీ ఉండదు కాకపోతే.. ప్రజాధనాన్ని జీతంగా తీసుకోవడం మాత్రం ఆపేయాల్సి ఉంటుంది. రాజ్యాంగేతర శక్తిగా.. ఆయన తన పవర్‌ను.. ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు. ఎలాంటి అధికారిక హోదా ఉండదు కాబట్టి.. హైకోర్టు కూడా ఎలాంటి కట్టడీ చేయలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close