అశోక్‌బాబుపై సాక్షికి అంత అక్కసెందుకు..?

ఎపీ ఎన్జీవో సంఘం నేత అశోక్ బాబుపై సాక్షి దినపత్రిక…. వారానికో కథనం ఉండేలా చూసుకుంటోంది. ఆయనపై పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకుడి ముద్ర వేయాలని తాపత్రయ పడుతోంది. ఆయన త్వరలోనే స్వచ్చంద పదవి విరమణ చేయబోతున్నారని… ఆ వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయిపోతారని.. కుదరకపోతే.. కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని… అటూ ఇటూ మార్చి ఇదే కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విడతల వారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో సారి అదే తరహాలో ఓ మాదిరి పెద్ద కథనాన్నే ప్రచారంలోకి తేవడం ఆసక్తి కరంగా మారింది. అశోక్‌బాబుకు చంద్రన్న కానుక ఇచ్చేశాడని తేల్చింది.

ఉద్యోగసంఘాల నేతగా అశోక్‌బాబు ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటారు. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటం ఆయనకు ముఖ్యం. ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తూ… వీలైనంతగా ఉద్యోగుల ప్రయోజనాలను ఆయన సాధిస్తున్నారు కూడా. కానీ సాక్షి లక్ష్యం వేరు… ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా… అశోక్ బాబు వ్యవహరించాలని కోరుకుంటోంది. ఆయన ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రకటనలు చేయాలని ఆశ పడుతోంది. అలా చేస్తేనే ఆయన … ఎపీఎన్జీవో సంఘం నేతగా నిఖార్సుగా పని చేస్తున్నట్లు.. లేకపోతే.. టీడీపీలో చేరిపోతున్నట్లు సాక్షి పత్రిక ప్రచారం చేస్తోంది. నిజానికి తన రాజకీయ జీవితం గురించి…తాను ఉద్యోగ విరమణ చేసిన తరవాతే నిర్ణయం తీసుకుంటానని అశోక్ బాబు చాలా సార్లు ప్రకటించారు. స్వచ్చద పదవీ విరమణకు దరఖాస్తు చేశారని.. గతంలో వైసీపీ, బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. అలా దరఖాస్తు చేసినట్లు నిరూపిస్తే.. ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తానని సవాల్ చేశారు కూడా. కానీ వైసీపీ, బీజేపీ నేతల లక్ష్యం వేరు కాబట్టి.. ఆయన టార్గెట్ గా కథనాలు ప్రచురిస్తూనే ఉన్నారు.

ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరగాలంటే.. ఎపీ ఎన్జీవో సంఘమే మంచి ఆయుధమని… వైసీపీ అగ్రనాయకత్వం ఆశ పడుతున్నట్లు ఉంది. అందుకే వీలైనంతగా… అశోక్ బాబుపై టీడీపీ అనుకూల ముద్ర వేసి బయటకు పంపేస్తే.. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే నేతలకు పగ్గాలు చేతికొచ్చేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే అశోక్ బాబు పదవి విరమణ లేకపోయినప్పటికీ… ఆయన తరవాత స్థానాల్లో ఉన్న వారిపైనా…. టీడీపీ అనుకూల ముద్ర వేస్తోంది. వారిని ఉద్యోగ సంఘాల యూనిట్లు వ్యతిరేకిస్తున్నట్లు సాక్షి పత్రిక ద్వారా ప్రచారం ప్రారంభించారు. వైసీపీకి అనుకూలంగా ఉండే ఎన్జీవో నేతకు పదవి దక్కే వరకూ అశోక్ బాబు అండ్ కో పై … సాక్షి ప్రచారం ఆగకపోవచ్చేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close