ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్త పేరు కనికా టేక్రివాల్ రెడ్డి వైఫ్ ఆఫ్ శరత్ రెడ్డి !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ సారి కనికా టేక్రివాల్ రెడ్డి అనే మహిళ పేరు వెలుగులోకి వచ్చింది. ఈమెకు జెట్‌ సెట్ గో పేరుతో ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు అద్దెకు ఇచ్చే కంపెనీ ఉంది. ఇటీవల కుబేరులు ప్రత్యేక విమానాల్లో తిరిగేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు తిరుగుతున్నారు. ఈ కారణంగా ఈ జెట్ సెట్ గో కంపెనీకి గిరాకీ ఎక్కువగానే ఉంది. ఏపీతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం కూడా అద్దెకు తీసుకునే విమానాలు.. చార్టర్డ్ ఫ్లైట్లు ఈ కంపెనీనే సమకూరుస్తుందని చెబుతున్నారు. ఈ కనికా టేక్రివాల్రెడ్డి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి భార్య.

శరత్ చంద్రారెడ్డి మొదటి భార్య.. అరబిందో ఫార్మా వ్యవస్థాపకుల్లో ఒకరైన నిత్యానందరెడ్డి కుమార్తె. విడాకులిచ్చారో లేకపోతే .. అలాంటి అవసరమే లేకుండా రెండో పెళ్లి చేసుకున్నారో కానీ కనికా టేక్రివాల్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె పేరు కనికా టేక్రివాల్ రెడ్డి అయింది. పెళ్లి అయిన తర్వాత ఫ్లైట్ల బిజినెస్ స్టార్ట్ చేశారో అంతకు ముందే ప్రారంభించారో స్పష్టత లేదు కానీ.. ఈ ఫ్లైట్లలోనే ఢిల్లీ మద్యం స్కాంకు సంబంధించిన నగదును తరలించారన్న అనుమానాల్ని ఈడీ చేస్తోంది. ఈ కంపెనీకి చెందిన విమానాలు బేగంపేట నుంచి ఎక్కడెక్కడకు వెళ్లాయి.. ఎవరెవరు వెళ్లారన్న వివరాలను ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈడీ సేకరించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో బయటకు లాగాలని ఈడీ గట్టి పట్టుదలగా ఉందని తాజా పరిణామాలతో తెలుస్తోంది. ఈ వ్యవహారం ఏపీలోనూ విస్తరించడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదాన్ డిస్టిలరీస్ సొమ్ముతోనే .. శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు కట్టారని అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికి బయటకు వచ్చింది గోరంత… ఇంకా తెలియాల్సింది కొండంత ఉందని రాజకీయవర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close