మహామనిషి… దటీజ్ సావిత్రి!

తెలుగు ప్రేక్షకులు తమ హృదయాల్లో ‘మహానటి’ స్థానాన్ని చోటిచ్చింది ఒక్క సావిత్రికి మాత్రమే. అందులో ఎవరికీ ఎటువంటి సందేహాలూ లేవు. సావిత్రి మహానటి మాత్రమే కాదు… మహామనిషి కూడా. ఆవిడ చేసిన దానధర్మాలు, సహాయాల గురించి ఇప్పటికీ ఎంతోమంది సినిమా ప్రముఖులు కథలు కథలుగా చెబుతుంటారు. సావిత్రి వ్యక్తిత్వం గురించి మరింత లోతుగా తెలిస్తే.. మహామనిషి కంటే ఎక్కువని చెప్పాల్సిందే. నటిగా ఎంత బిజీగా వున్నప్పటికీ… అమ్మ ఫ్యామిలీకి టైమ్ కేటాయించేదని సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి తెలిపారు. ఓ తల్లిగా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడంతో పాటు స్నేహితురాలిలా తమతో కలిసి చిలిపి పనులు చేసేదని ఆమె పేర్కొన్నారు. “చెట్లు ఎక్కడం.. చింతకాయలు, మామిడి కాయలు కోయడం.. కోతికొమ్మచ్చి ఆటలు ఆడటం.. వానలో తడవడం… ఇలా మాతో కలిసి అమ్మ ఎన్నో చిలిపిపనులు చేసేది. ఎంత అలసటగా వున్నా సంతోషంగా గడిపేది” అని విజయ చాముండేశ్వరి తెలిపారు. ప్రతి తల్లి చేసే పనులే ఇవి. అయితే… నటిగా ఎంత బిజీగా వున్నప్పటికీ తల్లిగా చేయడం గ్రేటే. ఇక, సావిత్రిని మహామనిషిని చేసే సంఘటన ఏంటంటే… తమ దగ్గర పని చేసే వ్యక్తులను గౌరవించడం. పనివాళ్లను ఆమె మాత్రమే గౌరవించడం కాదు… పిల్లలు గౌరవించకపోయినా ఒప్పుకొనేవారు కాదట. పనివాళ్లనూ పిల్లలతో, ఫ్యామిలీతో కలిసి భోజనం చేయమని ఆహ్వానించేవారట. ఎంతమందికి అంత మంచి హృదయం వుంటుంది చెప్పండి. అందుకనే ఆవిడను మహానటితో పాటు మహామనిషి అనేది. దటీజ్ సావిత్రి. ఇటువంటి ఎన్నో విశేషాలతో రూపొందిన సినిమాయే ‘మహానటి’. సావిత్రి జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close