తెలుగులో సినిమాలు అందుకే త‌గ్గించింద‌ట‌!

శ్రుతిహాస‌న్ జోరు తెలుగులో బాగా త‌గ్గింది. శ్రీ‌మంతుడు త‌ర‌వాత‌.. ప్రేమ‌మ్‌లోనే క‌నిపించింది. అయితే ఈ రెండు సినిమాలూ హిట్టే. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కాట‌మ‌రాయుడులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. రెండేళ్ల‌లో రెండే సినిమాలు చేయ‌డ‌మేంటి? తెలుగు ప‌రిశ్ర‌మ‌కు శ్రుతి దూరం అవుతోందా? లేదంటే తెలుగు ప‌రిశ్ర‌మే శ్రుతిని దూరం పెడుతోందా? ఇదే విష‌యంపై శ్రుతిహాస‌న్ స్పందించింది. ”నాకు అన్ని భాష‌లూ ముఖ్య‌మే. తెలుగు, త‌మిళం, హిందీల్లో న‌టిస్తున్నా క‌దా?? వివిధ భాష‌ల్లో న‌టిస్తూ, అక్క‌డి సంస్క్రృతి సంప్ర‌దాయాల్ని ద‌గ్గ‌రుండి గ‌మ‌నించ‌డం, వారి అల‌వాట్ల‌ను ప‌రిశీలించ‌డం నాకు ఇష్టం. మా ఇంట్లో కూడా ఐదారు భాష‌లు మాట్లాడుతుంటారు. నాకు తెలీని ఓ కొత్త భాష నుంచి అవ‌కాశం వ‌స్తే.. చేతిలో ఉన్న సినిమాల్ని వ‌దిలేసి మ‌రి న‌టించ‌డానికి సిద్ద‌ప‌డ‌తా” అంటోంది శ్రుతి.

మిగిలిన భాష‌ల నుంచి అవ‌కాశాలు రావ‌డంతోనే తెలుగు సినిమాల్ని త‌గ్గించింద‌ట‌. అయితే తెలుగు ప్రేక్ష‌కులంటే త‌న‌కు చాలా గౌర‌వ‌మ‌ని, త‌న‌ని న‌టిగా గుర్తించిన తొలి ప్రేక్ష‌కులు తెలుగువాళ్లే అంటోంది. ”నా అభిమాన ప్రేక్ష‌కులు తెలుగువాళ్లే. ఇక్క‌డే నాకు మంచి విజ‌యాలు ద‌క్కాయి. తెలుగు సినిమానీ, ఇక్క‌డి వాతావ‌ర‌ణాన్ని మిస్ అవ్వ‌డం నాకూ వెలితిగానే ఉంది. కాట‌మ‌రాయుడుతో మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాన‌న్న న‌మ్మ‌కం ఉంది. ఇక నుంచి క‌నీసం యేడాదికి మూడు తెలుగు సినిమాలుండేలా చూసుకొంటా” అని భ‌రోసా ఇచ్చింది శ్రుతిహాస‌న్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close