చిన్న విషయాలు లైట్..! చిరు ఫ్యామిలీకి చిక్కులు..!

మెగా ఫ్యామిలీ.. చిన్న చిన్న విషయాల పట్ల.. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. వాటి గురించి ప్రజల్లోకి తప్పుడు ప్రచారం వెళ్లిపోతోంది. ఉయ్యాలవాడ వంశస్తులు.. రామ్ చరణ్ ఇంటి ముందు ధర్నా చేయడం.. ఒక్క సారిగా హాట్ టాపిక్ అయింది. వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తూ.. ఆ సినిమా కథకు మూలం అయిన వారిని.. చిన్న చిన్న విషయంలో.. చీట్ చేశారన్న అభిప్రాయం దీని వల్ల ఏర్పడిపోయింది. అసలేం జరిగిందో.. ఆ చిత్ర వర్గాలు.. చెప్పినా… ధర్నా చేసిన వాళ్ల వెర్షనే ఎక్కువగా.. ప్రజల్లోకి వెళ్లిపోతుంది. దీంతో.. మెగా ఫ్యామిలీకి మరకలు తప్పడం లేదు.

ఉయ్యాలవాడ వంశీకులతో గొడవ తీర్చుకోలేరా..?

నిజానికి.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్తులకు… సైరా సినిమా యూనిట్ కు మధ్య ఉన్నది కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని.. సినిమా వర్గాలు చెబుతున్నాయి. సైరా సినిమాను తీయాలనుకున్నప్పుడు.. ఆ చిత్ర యూనిట్… కొన్ని విషయాల కోసం వారిని సంప్రదించింది. మొదట్లో.. వారు.. కొన్ని విషయాల మీద అభ్యంతరం వ్యక్తం చేసినా.. తర్వాత సద్దుమణిగిపోయింది. అయితే.. ఈ పరిస్థితిని ఇలాగే.. కొనసాగించడంలో.. సైరా యూనిట్ విఫలమయింది. వారికిచ్చిన హామీలను అమలు చేయడంలో… నిర్లక్ష్యం చూపించారు. నిజానికి అంత పెద్ద సినిమా అదీ కూడా.. చిరంజీవి హీరోగా వస్తున్నప్పుడు.. దానిపై ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యూనిట్ పై ఉంది. వారి వెర్షన్‌ను బట్టి ఇదేమీ అంత పెద్ద వివాదం కాదు. సింపుల్‌గా తేలిపోయేదే. కానీ.. పట్టించుకోవకపోవడం వల్ల.. వివాదం పెరిగి పెద్దదయింది. దీంతో.. మెగా ఫ్యామిలీ.. ఇలాంటిదా అన్న చర్చ బయటకు వచ్చేస్తోంది.

లైబ్రరీ చేసిన డ్యామేజ్ గుర్తు లేదా..?

గతంలో.. కూడా.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు… ఓ లైబ్రరీ విషయంలో.. ఇలాగే రచ్చ అయిపోయింది. అది ఎంతగా డ్యామేజ్ చేసిందంటే… పాలకాల్లులలో చిరంజీవి ఓడిపోవడానికి అది కూడా ఓ కారణం అని అనుకున్నారు. కొణిదెల కుటుంబం స్వస్థలం… మొగల్తూరులో..వారికి ఓ ఇల్లు ఉందని… పెంకుల కప్పు ఉండే.. ఆ ఇల్లు ఆలనాపాలనా లేకుండా పడి ఉందని.. దాన్ని లైబ్రరీకి ఉపయోగించుకుంటామని.. అడిగినా… మెగా సోదరులు ఇవ్వలేదన్న ప్రచారం జరిగింది. చిరంజీవి తండ్రి పేరు మీదే లైబ్రరీ పెడతామని చెప్పినా.. ఉమ్మడి ఆస్తి కాబట్టి.. ఇవ్వలేమని చెప్పినట్లు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. తర్వాత దాన్ని అమ్మేశారని కూడా చెప్పుకున్నారు. మహా అయితే.. రూ. రెండులక్షలు మాత్రమే చేసే ఆ ఇంటిని కూడా… లైబ్రరీ కోసం మెగా ఫ్యామిలీ ఇవ్వలేదన్న ప్రచారం జరగడంతో… ఎన్నికల్లో నెగటివ్ అయింది. దీన్ని మెగా కుటుంబం ఎన్ని సార్లు ఖండించినా.. ఆ ప్రచారం అలా సాగుతూనే ఉంది.

చిన్న చిన్న వివాదాలతోనే ఇమేజ్ తేడా..!

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం. అసలు నిజం కన్నా.. ఫేక్ న్యూస్ ముందుగా వెళ్లిపోతుంది. పైగా ఇప్పుడు… మెగా కుటుంబం నుంచి పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఆయనను టార్గెట్ చేస్తూ.. నిందలు వేయడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఇలాంటి సమయంలో… మెగా కుటుంబం.. చిన్న చిన్న వివాదాల పట్ల మరింత సీరియస్‌గా ఉండాలన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది. లేకపోతే.. బ్యాడ్ ఇమేజ్.. అలా కొనసాగుతూనే ఉంటుందని.. ఆవేదన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close