ఏపిలో ఇక డీలర్ల వద్దే కొత్త వాహనాలకు శాశ్విత రిజిస్ట్రేషన్లు

ఆంధ్రప్రదేశ్ లో వాహన కొనుగోలుదార్లకు శుభవార్త. డీలర్ల వద్దే కొత్త వాహనాలకి ఆన్-లైన్ ద్వారా శాశ్విత రిజిస్ట్రేషన్ చేయించుకొనే వెసులుబాటు రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుండి అమలులోకిరాబోతోంది. మొదట ప్రయోగాత్మకంగా ఈ ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని విశాఖలో అమలుచేసి పరిశీలించి చూస్తారు. అది విజయవంతం అయితే వెంటనే రాష్ట్రంలో అన్ని జిల్లాలలోను అదే విధానాన్ని అమలుచేస్తామని రాష్ట్ర రవాణాశాఖ కమీషనర్ ఎన్.బాలసుబ్రమణ్యం మీడియాకి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

ఇంతవరకు డీలర్ల వద్దే కొత్త వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు శ్వాసిత రిజిస్ట్రేషన్ కూడా చేయగలిగితే వాహన యజమానులు రవాణాశాఖ కార్యాలయం చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రేపు ఈ నూతన విధానాన్ని ప్రారంభించే అవకాశం ఉందని కమీషనర్ బాలసుబ్రమణ్యం చెప్పారు. డ్రైవింగ్ లైసెన్సుల పొందేందుకు నిర్వహించే పరీక్షల కోసం త్వరలో కియోస్క్ లను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించే ట్రాక్ ల వద్ద రవాణాశాఖ అధికారి అభ్యర్ధుల తప్పొప్పులను పరీక్షిస్తుంటారు. దాని కోసం డ్రైవింగ్ ట్రాక్ ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని మొదట విజయవాడలో ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close