వైసీపీ టు టీడీపీ ..స్ట్రాటజిస్టుల ఫిరాయింపులు !

స్ట్రాటజిస్టుల మధ్య కూడా రాజకీయం తరహాలో యుద్ధం జరుగుతోంది. ఆ ఫలితం జంపింగుల దాకా వచ్చింది. ఇప్పటి వరకూ రాజకీయ నేతలు పార్టీలుమారుతారని వింటున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా స్ట్రాటజిస్టులు కూడా మారుతున్నారు. వైసీపీకి ఐప్యాక్ తరపున రుషిరాజ్ లీడ్ చేస్తున్నారు. ఆయన పేరుకే ఉంటారు కానీ ఆలోచనలు మొత్తం శంతను సింగ్ అనే మరో డైరక్టరవని చెబుతూంటారు. ఏమయిందో ఏమో కానీ..హఠాత్తుగా ఈ శంతను సింగ్ ఐ ప్యాక్ కు రిజైన్ చేసి.. టీడీపీకి స్ట్రాటజిస్టుగా సేవలు అందిస్తున్న రాబిన్ శర్మ కంపెనీ షోటైమ్ కన్సల్టింగ్ లో చేరిపోయాడు.

శంతను సింగ్ వ్యవహారం ఇప్పుడు రెండు రాజకీయ పార్టీల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి . ‘ఐప్యాక్’ పొలిటికల్ వింగ్ ను చూశారు. 2019 ఎన్నికల సమయంలోను ఆయన వైసీపీ కోసం పనిచేశారు. ఎక్కువ కాలం ఆయన వైసీపీకి చేసివుండటంతో ఆ పార్టీ అనుసరిస్తోన్న వ్యూహాలు, బలహీనతలను తెలుస్తాయనే ఉద్దేశంతో టీడీపీ శంతన్ కు ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తోంది. వైసీపీలో పరిస్థితి ఏమీ బాగోలేదని సర్వేలు రిపోర్టులు అప్పుడప్పుడూ బయటకు వస్తున్నాయి.

అక్కడ ఉంటే మొత్తానికే మోసం వస్తుందనుకున్నారో..రుషిరాజ్ తో విబేధాలో కానీ.. శంతన్ సింగ్ బయటకు రావడం ఐ ప్యాక్ టీము షేక్ కు గురి చేస్తోంది. తమ స్ట్రాటజీలు అన్నీ ఇక టీడీపీకి తెలిసినట్లేనని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఐ ప్యాక్ కు కావాల్సినంత ఆర్థిక దన్ను ఉంది కాబట్టి..రాబిన్ శర్మ టీం నుంచి కీలక వ్యక్తుల్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా స్ట్రాటజిస్టుల మధ్య కూడా రాజకీయం చురుకుగా సాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close