చెర్రీ, సుక్కు… రిపీటే!

అల్లు అర్జున్ తో రెండు సినిమాలు చేశాడు సుకుమార్‌. ఇప్పుడు మ‌హేష్ బాబుతో త‌న రెండో సినిమా ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. రామ్‌చ‌రణ్‌తో కూడా ఈ ఫీట్‌ రిపీట్‌… చేయ‌బోతున్న‌ట్టే క‌నిపిస్తోంది. సాధార‌ణంగా ఓ హిట్టు కొట్ట‌గానే.. ఆ కాంబినేష‌న్‌ని మ‌రోసారి చూడాల‌నుకుంటారు ప్రేక్షకులు. ఆ కాంబో క్రేజ్ కూడా ఆస్థాయిలోనే ఉంటుంది. ‘రంగ‌స్థ‌లం’ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర‌వాత‌.. మ‌ళ్లీ ఆ కాంబో రిపీట్ అవ్వ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు కూడా. అందుకే ‘రంగ‌స్థ‌లం’ వంద రోజుల వేడుక‌లో `నీతో మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయాల‌ని వుంది చెర్రీ` అంటూ సుక్కు త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాడు. చ‌ర‌ణ్ కూడా ‘క‌థ తొంద‌ర‌గా చెప్పు మ‌రి’ అంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇదేం స్టేజీ పై షో చేయ‌డానికి చెప్పిన మాట‌క ఆదు.. నిజంగానే ఈ కాంబో రిపీట్ చేయ‌డానికి అటు చ‌ర‌ణ్‌, ఇటు సుకుమార్ చొర‌వ చూపిస్తున్నారు. ‘రంగ‌స్థ‌లం’ క‌థ చెప్ప‌డానికి ముందే.. సుకుమార్ చ‌ర‌ణ్ కోసం రెండు మూడు క‌థ‌లు సిద్ధం చేశాడు. ‘రంగ‌స్థ‌లం’ క‌థ ఓకే కాక‌పోతే… మిగిలిన క‌థ‌లు చెప్పి ఓకే చేయించుకుందామ‌నుకున్నాడు. కానీ ఆ ఆవస‌రం లేకుండానే తొలి సిట్టింగ్‌లోనే ‘రంగ‌స్థ‌లం’ క‌థ ఓకే అయ్యింది. అప్పుడు మిగిలిపోయిన ఆ క‌థ‌ల్లో.. ఒక‌టి ఇప్పుడు ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. అయితే ఇప్పుడు ఇటు చ‌ర‌ణ్‌, అటు సుక్కు ఇద్ద‌రూ బిజీనే. కాస్త ఖాళీ దొరికినా… ఆ గ్యాప్‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close