సుకుమార్‌తో ఈరోస్ వ‌న్స్‌మోర్‌!

దర్శకుడిగా సుకుమార్ కమర్షియల్ స్టామినా తెలియజేసిన సినిమా ‘రంగస్థలం’. అంతకు ముందు ఆయన ఖాతాలో విజయాలు లేవని కాదు. దర్శకుడిగా సుకుమార్ ప్రతిభను తక్కువ చేయడమూ లేదు. రంగస్థలానికి ముందు సుకుమార్‌ని మేథావి దర్శకుడిగా ఎక్కువమంది పరిగణించేవారు. ఈ లెక్కల మాస్టారు లాజిక్కులు స్క్రీన్‌ప్లే లాజిక్కులు సామాన్యులకు అర్థం కావనే విమర్శ వినిపించేది. ‘రంగస్థలం’తో ఫక్తు కమర్షియల్ సినిమాలూ తీయగలడని పేరొచ్చింది. దాంతో సుకుమార్ దర్శకత్వంలో సినిమాలు చేయాలనే నిర్మాతల సంఖ్య మరింత పెరిగింది. అందులో ప్రముఖ హిందీ నిర్మాత సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ కూడా వుంది.

‘రంగస్థలం’ తరవాత తన తదుపరి సినిమాను కూడా ఆ సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో సుకుమార్ చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు అందులో హీరో. మహేష్ సినిమా తరవాత ఈరోస్ సంస్థలో సుకుమార్ హిందీ సినిమా చేసే ఛాన్స్ వుంది. దీనికి రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించనున్నారని వార్తలు వచ్చాయి. వాటిపై ఆయన స్పందించారు. “ఈరోస్‌తో సుకుమార్ సినిమా చేయనున్న మాట నిజమే. అదే సంస్థకు నేను పది కథలు అందిస్తున్నా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ పది కథలతో సినిమాలు చేస్తారు. ఈ పది సినిమాల్లో సుకుమార్ సినిమా లేదు. అది వేరే సినిమా” అని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మొత్తం మీద ఆయన ఈరోస్ సంస్థలో సుకుమార్ సినిమా చేయనున్నారని కన్ఫర్మ్ చేశారు.

మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. విడుదలకు ముందు ఈరోస్ సంస్థ సినిమాను కొనేసింది. ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసింది. ఇప్పుడు సుకుమార్‌తో మరోసారి చేతులు కలపడానికి ముందుకొచ్చింది. ఈరోజు విడుదల కానున్న ‘సాక్ష్యం’ సినిమానూ ఈరోస్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సంస్థ తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి సుముఖంగా వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close